ప్రస్తుతం ఎక్కడ చూసినా “బిగ్ బాస్” ఫీవర్ నడుస్తుంది.అందరు కౌశల్ ఆర్మీ గురించే మాట్లాడుకుంటున్నారు.
బిగ్ బాస్ లో ప్రతివారం ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే విషయం అందరికి తెలిసిందే.ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వారిలో సంజన, శ్యామల, నూతన నాయుడు, కిరీటి, తేజస్వి, భాను ఉన్నారు.
అయితే అందరి ఎలిమినేషన్ ఊహించిందే…ఒక్క “యాంకర్ శ్యామల” గారి ఎలిమినేషన్ మాత్రం ఎవరు ఊహించలేదు.ఎందుకంటే హౌస్ లో లేడీ రేలంగి మావయ్య టైపు శ్యామల గారు.
సైలెంట్ గా అందరిని నవ్విస్తూ ఉండే టైపు.
ఆమెను కావాలని ఎలిమినేట్ చేశారని పుకార్లు షికారు చేశాయి.దీనికి కారణం ఆమె కుమారుడి బర్త్ డే జూలైలో ఉంది కాబట్టి దాని కోసం ఆమెను కావాలని ఎలిమినేట్ చేశారని ప్రేక్షకుల నుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి.దీనిని నిజం చేస్తూ శ్యామల కుమారుడి బర్త్ డే అయిన రెండు రోజులకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆమెను హౌస్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది బిగ్బాస్ షో.ప్రేక్షకుల ఓటింగ్లో ఎక్కువ శాతం ఓట్లు నూతన్ నాయుడికే పడ్డాయని సమాచారం.అప్పుడు ఆయన ఒక్కరినే హౌస్లోకి తీసుకోవాలి కానీ శ్యామలను కూడా తీసుకోవడంతో ప్రేక్షకుల అనుమానాలకు బలం చేకూరినట్టైంది.