తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 4 సీజన్ ఇప్పుడిప్పుడే కాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతోంది.ఇప్పటివరకు షో నుండి ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా ముగ్గురు బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంటరయ్యారు.
ఇక తాజా వారంలో మొత్తం బిగ్ బాస్ హౌస్ లో ఏడు మందిని ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ చేయగా అందులో తాజాగా మోనల్, లాస్య లు సేవ్ అయిపోయారు.ఇక ఈ రోజు మిగతా ఐదుగురు వ్యక్తులలో ఎవరు బయటకు వెళ్తారో తేలనుంది.
అయితే గత వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ తెగ హడావిడి చేసింది బిగ్ బాస్ బృందం.అందుకు తగ్గట్టే చివరి నిమిషం వరకు డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లుగానే మొదటగా ఇంటిలో నుంచి కరాటే కల్యాణిని బయటికి పంపించిన బిగ్ బాస్, మరుసటి రోజు దేత్తడి హారిక కూడా ఎలిమినేట్ అయిందని ముందుగా చెప్పాడు.
అయితే చివరి నిమిషంలో ఈ వారం కేవలం సింగిల్ ఎలిమినేషన్ అని మాత్రమే చెప్పి హారికను హౌస్ లోనే ఉంచేసాడు.అయితే ఈ వారం అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ నుండి ఇద్దరు వ్యక్తులు ఎలిమినేట్ కాబోతున్నట్లు సమాచారం.
ఇక నిన్న ఇద్దరు సేవ్ అవ్వగా ఇక ఎలిమినేషన్ లిస్టులో దేవి నాగవల్లి, హారిక, అరియనా, మెహబూబ్, కుమార్ సాయి లు ఉన్నారు.
ఇక ఇప్పటికే ఓట్స్ పోలింగ్ నిలిచిపోవడంతో డబుల్ ఎలిమినేషన్ జరుగుతున్న కారణంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి మెహబూబ్, దేవి నాగవల్లి ఎలిమినేట్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు.
చూడాలి మరి ఈ రోజు కేవలం సింగిల్ ఎలిమినేషనో లేకపోతే అందరూ అనుకున్న విధంగానే దేవి నాగవల్లి, మెహబూబ్ లతో డబుల్ ఎలిమినేషన్ నిర్వహించబోతున్నారో.