మానవ మృగంగా మారిపోయి నిస్సహాయ స్థితిలో తల్లి కొడుకులను దారుణంగా వధించిన సెంథిల్ కుమార్ (32)ను ఈ రోజు కోయంబత్తూరు మహిళా కోర్టు 2సార్లు ఉరి తీయమని తీర్పు నిచ్చింది.అంతే కాకుండా 7 ఏళ్ళ పాటు కఠిన కారాగార శిక్ష అమలు చేయాలని ఆదేశించింది .
మూడు మర్దర్లకు వేయి రూపాయలు చొప్పున జరిమానా విధించింది.అసలు సెంథిల్ చేతిలో మూడు మర్దర్లకు కారణం కేవలం సెంథిల్ ను ఇల్లు ఖాళి చేయించినందుకు కసి పెట్టుకుని చేసిన దారుణంగా ప్రాసిక్యూషన్ కథనం .కోయంబత్తూరు గణపతి రామకృష్ణాపురం రంగనాథన్ వీధిలో వత్సలాదేవి (27) తన కొడుకులు మలిగన్ (7) ప్రనీత్ (11నెలలు) తో నివాసము ఉంటోంది.ఆమె పక్క గది సెంథిల్ కు అద్దెకిచ్చి అతడి తీరు బాగోనందున ఖాళీ చేయించింది .ఆ కసి తో గత ఏడాది జూన్ 1న ఆమెపై అత్యాచారం చేసి కత్తితో 52 సార్లు పొడిచి చంపేసాడు బయంతో వణికిపోతున్న కొడుకు మలిగాన్ ను 21కత్తిపోట్లతో చంపేసి ప్రనీత్ 11కత్తిపోట్లతో హత్యచేసాడు .