అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘దొరసాని’ ఫస్ట్లుక్ వచ్చేసింది.విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా మరియు జీవిత రాజశేఖర్ల కూతురు శివాత్మిక హీరోయిన్గా పరిచయం అవ్వబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
విభిన్నమైన టైటిల్తో సురేష్ ప్రొడక్షన్స్లో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ విడుదలైంది.ఫస్ట్లుక్లోనే సగం స్టోరీపై క్లారిటీ ఇచ్చేశారు.
సినిమాలో హీరోయిన్ శివాత్మిక దొర వారి ఇంటి బిడ్డ అవ్వగా, ఆనంద్ ఒక సాదారణ కుటుంబంకు చెందిన కుర్రాడు.వారిద్దరి మద్య ప్రేమ, తదనంతర పరిణామాల నేపథ్యంలో సినిమా ఉంటుందని తేలిపోయింది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు.త్వరలోనే టీజర్ విడుదల కాబోతుంది.
ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను చూస్తుంటే మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘కంచె’ చిత్రం గుర్తుకు వస్తుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కంచె చిత్రంలో కూడా హీరోయిన్ రాజా వారి ఇంటి కూతురు అవ్వగా హీరో వరుణ్ తేజ్ మాత్రం ఒక మామూలు పేద కుటుంబంకు చెందిన కుర్రాడు.వారిద్దరి మద్య ప్రేమ, గ్రామంలో గొడవలు సినిమాలో చూపించారు.ఇప్పుడు దొరసాని చిత్రంలో కూడా అలాంటి స్క్రీన్ప్లే ఉంటుందేమో అని ఫస్ట్లుక్ను చూస్తుంటే అనిపిస్తుంది.
ఇక ఈ చిత్రం ప్రస్తుత జనరేషన్కు సంబంధించిన సినిమా కాదని, పీరియాడిక్ సినిమా అని కూడా అనిపిస్తుంది.మొత్తానికి ‘దొరసాని’ చిత్రం కొత్తదనంతో ఆకట్టుకుంటుందా లేదంటే కంచె తరహాలో సాదారణంగా తేలిపోతుందా అనేది చూడాలి.