టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి రష్మిక మందన.ఈ భామ వరుస అవకాశాలతో టాలీవుడ్ లో పాగా వేసింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ కి జోడీగా సుకుమార్ సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.
దీంతో పాటు ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా ఈ భామ పేరు పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.వీటితో పాటు కుర్ర హీరోలతో కూడా ఈ అమ్మడు జోడీ కడుతుంది.
ఇక తెలుగులో బిజీ కావడంతో సొంత భాష సినిమాలని ఈ అమ్మడు పూర్తిగా పక్కన పెట్టేసింది.
ఇదిలా ఉంటే కన్నడలో కిరీక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ సినిమా హీరో, దర్శకుడు అయిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి పెళ్లి వరకు వెళ్ళింది.తరువాత తెలుగులో హీరోయిన్ గా బిజీ కావడంతో కెరియర్ కోసం రక్షిత్ ని పక్కన పెట్టింది.
ఇప్పుడు రక్షిత్ శెట్టి కిరీక్ పార్టీ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు.కాలేజీ గొడవలు, రాజకీయాలు నేపధ్యంలో సాగే మొదటి సినిమాకి సీక్వెల్ అంటే అందులో ఉన్న వాళ్ళు ఇందులో ఉంటారని భావిస్తారు.
ఈ నేపధ్యంలో రష్మికని ఈ సినిమా కోసం తీసుకుంటారా అని మీడియా వాళ్ళు రక్షిత్ శెట్టి దగ్గర ప్రస్తావించారు.అయితే ఈ సీక్వెల్ అందరూ కొత్త వాళ్ళతో తీస్తున్నామని చెప్పి ఆమెని పక్కన పెట్టినట్లే అని పరోక్షంగా చెప్పేసాడు.