ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ పేరు మూట కట్టుకున్నాడు.ఈయన అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
అమెరికా దేశస్తులు కూడా ఎంతుకు ఈయన్ను అధ్యక్షుడిగా చేశామని బాధపడుతున్నారు.వచ్చే ఎన్నికల్లో ఈయన గెలుపు దాదాపు అసాధ్యం అంటున్నారు.
ఇదే సమయంలో ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.ఈయన వ్యాఖ్యలపై జోకులు కూడా పేలుతున్నాయి.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్తో చర్చల సందర్బంగా ట్రంప్ తనకు నోబెల్ బహుమానం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు.
గతంలోనే ఈయన నోబెల్ బహుమానం గురించి మాట్లాడాడు.
ఇప్పుడు మరోసారి ఆ విషయం గురించి మాట్లాడటం జరిగింది.గతంలో ఒబామాకు నోబెల్ శాంతి పురష్కారం దక్కింది.
ఆయనకు ఎందుకు ఇచ్చారో నాకే కాదు ఆయనకు కూడా తెలియదు అంటూ వివాదాస్పదంగా మాట్లాడాడు.ఒక మాజీ అమెరికా అధ్యక్షుడి గురించి అవమానకరంగా మాట్లాడినందుకు గాను ఆయనపై అమెరికన్స్ సీరియస్ అవుతున్నారు.
తనకు నోబెల్ కావాలని అడగడం ఓకే కాని ఒబామాకు ఎందుకు వచ్చిందో అంటూ ప్రశ్నించడం ఏంటంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.నోబెల్ కమిటీ తీరుపై ట్రంప్ విమర్శలు చేశాడు.
నేను జరుపుతున్న శాంతి చర్చలు వారికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించాడు.