అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఈ సారి ఏకంగా అమెరికా ప్రతినిధుల సభకి తొలిసారిగా ఎన్నికైన నలుగురు మహిళలని ఉద్దేశించి తమ దేశం విడిచి పోవాలి అంటూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు.
తమ దేశం విడిచి, మీ మీ దేశాలకి వెళ్ళిపొండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు ఇందుకు సంభందించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా వలస వ్యవహారాల మంత్రిని ఆదేశించారు.
డెమోక్రటిక్ పార్టీ తరుపున మసా చూసెట్స్ నుండి ఎన్నికైన ప్రెస్లీ ఒకరు కాగా, మిచిగాన్ నుండి ఎన్నికైన రషీదా తాలిబ్ మరొకరు, అలాగే న్యూయార్క్ నుంచీ ఎన్నికైన అలెగ్జాం డ్రియా అకాషియో కార్టెజ్, మిన్నెసోటా నుండి ఎన్నికైన ఇలన్ ఉమర్ లని వారి స్వదేశాలకి పంపేందుకు రంగం సిద్దం చేయాలని ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు.అయితే అమెరికా వ్యాప్తంగా వివిధ నగరాలలో ఉంటున్న వలస కుటుంభాలని వారి వారి స్వదేసాలకి పంపాలని ట్రంప్ ఆదేశించిన కొన్ని రోజులలోనే ట్రంప్ ఆ మహిళా నేతలపై విరుచుకుపడటం అందరిని ఆశ్చర్య పరుస్తోంది.
వర్జీనియాలోణి స్టెర్లింగ్ లో ఉన్న గోల్ఫ్ క్లబ్ కి వెళ్ళే ముందు ట్రంప్ ఈ ట్వీట్ లు చేసి పెద్ద దుమారం రేపారు.అంతేకాదు ఆ మహిళ నేతలు వచ్చిన దేశాలు అత్యంత అవినీతవంతమైన దేశాలని ట్రంప్ వ్యాఖ్యానించడంతో ట్రంప్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చి పడుతున్నాయి.మరి ట్రంప్ వ్యాఖ్యలపై డెమోక్రటిక్ పార్టీ నేతలు ఏ విధంగా స్పదిస్తారో వేచి చూడాలి.