అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచార పర్వం జోరుగా సాగుతోంది.ఒక వైపు ట్రంప్ మరొక వైపు బిడెన్ లు పోటా పోటీ గా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రచారంలో ఎప్పుడు ముందుండే ట్రంప్ సరికొత్త కార్యక్రమాలు చేయడంలోనూ రచించడంలోనూ దిట్టనే చెప్పాలి.కానీ తాజాగా తన మద్దతు దారులు నిర్వహించిన ఓ ప్రచార కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది.
ఆ సమయంలో జరగరానిది జరిగిఉంటే ఈ పాటికి ట్రంప్ ని ఇంటా, బయట ఏకి పారేశేవాళ్ళు ప్రజలు.అసలు ఇంతకీ ఏం జరిగింది…
ట్రంప్ కి మద్దతుగా మద్దతు దారులు ఆస్కిన్ పశ్చిమ వైపు ఉన్న ట్రావిస్ సరస్సులో బోటుతో పెరేడ్ నిర్వహించారు.
సుమారు 100 పడవలతో 2500 వందల మందికి పైగా ట్రంప్ మద్దతు దారులు అందరూ ట్రంప్ కి ఓటు వేయాలని, ట్రంప్ కాబోయే అధ్యక్షుడు ట్రంప్ అంటూ బోట్లపై జెండాలతో నినాదాలు చేసుకుంటూ వెళ్తున్నారు.ఈ క్రమమలోనే ఒక్కసారిగా 100 బొట్లు తిరగడంతో అలజడి కలిగి సుమారు 4 బోట్లు నీట మునిగిపోయాయి…ఈ క్రమంలోనే
ట్రంప్ మద్దతుదారుల పడవలు మునిగిపోతున్నయాంటూ ట్రావిస్కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి సమాచారం అందటంతో వెంటనే స్పందించిన అధికారులు వారిని కాపాడారు.అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు.వీరు ఈ తరహా ప్రచారం చేయడానికి వీరికి ఎంటువంటి అనుమతులు లేవని ప్రకటించారు అధికారులు.
ఇదిలాఉంటే మునిగిపోయిన పడవలలో ఒక్కొక్క పడవలో సుమారు 100 మందికి పైగా ఉంటారని జరగరానిది జరిగిఉంటే ట్రంప్ ని మీడియా ప్రజలు ఏకి పారేసేవారని, ట్రంప్ త్రుటిలో తప్పించుకున్నారని అంటున్నారు విశ్లేషకులు.