అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికాలో ప్రస్తుతం ఎదుర్కుంటున్న గడ్డు పరిస్థితులు ఏవైనా ఉన్నాయంటే అవి రెండే రెండు ఒకటి కరోనా రెండు ఇద్దరు నల్ల జాతీయుల జాత్యహంకార హత్య.ఈ రెండు ట్రంప్ పదవికి ఎసరు పెట్టనున్న కీలకమైన విషయాలు.
కరోనాని కంట్రోల్ చేయలేక పోయాడంటూ ఎన్నో విమర్శలు అమెరికా ప్రజల నుంచీ వెల్లువెత్తాయి.ఈ క్రమంలోనే ఇద్దరు నల్ల జాతీయులు జార్జ్, బ్రూక్స్ లను అమెరికా పోలీసులు అత్యంత దారుణంగా హత్యలు చేయడంతో నల్ల జాతీయులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
ఈ పరిస్థితుల కారణంగా ఎన్నో విమర్శలు ట్రంప్ ని చుట్టూ ముట్టాయి.జాత్యాహంకారాన్ని ప్రోశ్చహిస్తున్నారని ఎంతో మంది తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.నల్ల జాతీయుల హత్యలపై ట్రంప్ స్పందన పట్ల అమెరికా పౌర సమాజం కూడా అసంతృప్తి చెందింది.ఇక ట్రంప్ కి భవిష్యత్తు గడ్డు కాలమే అనుకుంటున్న సమయంలో అందరి వ్యాఖ్యలకి చెక్ పెట్టేలా చనిపోయిన నల్ల జాతీయుల కుటుంబాలని కలిసారు.
వారికి తన ప్రఘాడ సానుబూతి తెలిపారు.
అంతేకాదు పోలీసుల తీరుపై మండిపడ్డారు.
పోలీసుల విధానాలపై సంస్కరణలు తీసుకురావాలని అందుకు నేను సుముఖంగా ఉన్నానని అందుకు సంభందిన ఫైల్ పై సంతకం చేశారు.అయితే జాత్యహకారానికి సంభందించిన ఎలాంటి ప్రకటన చేయక పోవడం ఇక్కడ కొస మెరుపు.
ఇదిలాఉంటే నల్ల జాతీయుల కుటుంభాలని కలుసుకున్న ట్రంప్ పోలీసులని కూడా కలుసుకున్నారు.అక్కడ ట్రంప్ మాట్లాడుతూ ప్రజలందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పోలీసులని మనం ఎంతో గౌరవించాలని అన్నారు.
వారిపై అన్యాయంగా ఎలాంటి ఆరోపణలు చేయరాదని, పోలీసులు అందరూ ఒకేలా ఉండరని స్వరం మార్చారు.
.