ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్ధులపై దాడిని మొదలు పెట్టాడు.ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ట్రంప్ తనదైన శైలిలో ప్రసంగాలు చేయడం మొదలు పెట్టాడు.
అధ్యక్షుడు అయిన తరువాత తనలో కామెడీ యాంగిల్ నే చూసిన ప్రజలు ఇప్పుడు అసలు సిసలైన రాజకీయ నాయకుడిని చూశామని అంటున్నారు. డెమోక్రటిక్ పార్టీ కంటే లేట్ గా ప్రచారం మొదలు పెట్టినా ట్రంప్ ఓ ఊపు ఊపెస్తున్నాడు.
అమెరికా ప్రజలలో సెంటిమెంట్ రగిల్చడంలో ముందు వరుసలో ఉండే ట్రంప్ ఆ దిశగానే ప్రయత్నాలు మొదలు పెట్టాడు…
ఒక్లాహమ్ లో తన ప్రచార పర్వాన్ని మొదలు పెట్టిన ట్రంప్ కి విశేష ఆదరణ లభించింది.ఎప్పుడు తనదైన ప్రసంగంతో ప్రత్యర్ధులపై బాణాలు వేసే ట్రంప్ ఈ సారి కూడా తన పదునైన మాటలకి పని చెప్పాడు.
తనని తోలు బొమ్మ అని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి బిడెన్ అనడంతో మండిపడ్డ ట్రంప్.అమెరికా ప్రజల సాక్షిగా బిడెన్ ని ఏకి పాడేశారు.
బిడెన్ రాడికల్ లెఫ్ట్ చేతుల్లో కీలు బొమ్మ అంటూ ఫైర్ అయ్యారు.బిడెన్ వాళ్ళు ఎలా చేయమంటే అలా చేస్తాడని అన్నారు.
అమెరికా చరిత్రని రాడికల్ లెఫ్ట్ నాశనం చేయాలనీ చూస్తోంది.ఇప్పటికే ఎన్నో ఆనవాళ్ళని వాళ్ళు శిధిలం చేశారు.వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవాలని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు.కానీ ట్రంప్ అనే వ్యక్తి ఉన్నంత వరకూ అది జరగదు.
అధికారాన్ని వారి చేతిలోకి వెళ్ళనివ్వానని అన్నారు.బిడెన్ గనుకా అధికారంలోకి వస్తే అమెరికా రాడికల్ లెఫ్ట్ చేతుల్లోకి వెళ్ళడం ఖాయమని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో బిడెన్ కి ఏ మాత్రం మద్దతు ఇవ్వకూడదని ట్రంప్ అమెరికా ప్రజలకి పిలుపునిచ్చారు.