అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై డెమోక్రటి పార్టీ నేతలు ప్రతినిధుల సభలో అభిశంసన పెట్టడం, ఆ అభిశంసనని స్పీకర్ నాన్సీ విచారణకు ఆదేశిస్తూ తీర్మానం చేయడం.దాంతో అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధులు ట్రంప్ పై విచారణ ఏర్పాటు చేయడం అంతా విధితమే.
అయితే ఈ క్రమంలోనే ట్రంప్ ప్రతినిధుల సభకి ఓ లేఖని రాశారు.తానూ విచారణకి వచ్చే పరిస్థితిలేదని తేల్చి చెప్పారు.
అభిశంసన విచారణలో ట్రంప్ వైట్ హౌస్ పాల్గొనే అవకాశం లేదని తెలిపారు.ట్రంప్ తరుపు న్యాయవాది పాట్ సిస్పోలోన్ తెలిపారు.ఈ మేరకు ఆయన ప్రతినిధుల సభ జుడిషియరీ కమిటీ చైర్మెన్ జెర్రీ కి లేఖని రాశారు.ప్రతినిధుల సభా సంఘం జరిపే విచారణపై తమకి నమ్మకం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై జరిపే విచారణ నిష్పాక్షికంగా ఉంటుంది అనే నమ్మకం తమకి కలగడంలేదని ఆయన స్పష్టం చేశారు.అందుకే విచారణలో పాల్గొనలేమని అన్నారు.అయితే ఈ ప్రకటన వెలువడక ముందే స్థానిక మీడియాలో ట్రంప్ అభిశంసనకి వెళ్ళరని వార్తలు కూడా వినిపించాయి.మరి విచారణకి ట్రంప్ హాజరుకాని నేపధ్యంలో డెమోక్రటి పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.