అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు కానీ ఇప్పటి వరకూ అధ్యక్ష పీటానికి వన్నె తెచ్చేలా ఏ రోజు కూడా ప్రయత్నిచలేదనేది బహిరంగ విమర్శే.ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, ఏ స్థాయి వ్యక్తులనైనా సరే చుకలనగా,అవమాన కరంగా మాట్లాడటంలో ట్రంప్ ఇప్పటికే పీహెచ్డీ చేసేశారు.
అత్యంత కీలకమైన అధికారులని, వైట్ హౌస్ కి చెందిన అధికారులు తనకి నచ్చకపోతే ట్విట్టర్ ట్వీట్ పెట్టినంత ఈజీగా పీకి పారేస్తుంటారు.వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వివాదాలలో ఉండే ట్రంప్ పై కించిత గౌరవం కూడా లేదు అమెరికాలోని మెజారిటీ ప్రజలకి.
తాజాగా
అధ్యక్షుడు మరో సారి దేశ సైనికులను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి వార్తల్లోకెక్కారు.యుద్దంలో చనిపోయిన వీర సైనికులను ట్రంప్ అవమానకరంగా మాట్లాడారని సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది.
మీడియాలో పెద్ద ఎత్తున ఈ విషయంపై చర్చలు జరగడంతో ఎన్నికల ముందు ఎక్కడ తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందోనని భయపడిన ట్రంప్ ప్రజలకి వివరణ ఇచ్చారు.యుద్దంలో ఓడిన వారు పారాజయం పొందారని వారిని జంతువులతో పోల్చారని తాను చేసినట్టుగా వస్తున్న వ్యాఖ్యలని ట్రంప్ ఖండించారు.
శ్వేత సౌధంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులని గానీ, వారి కుటుంభాలను కానీ ఏనాడు ఏమి అనలేదని ప్రకటించారు.జంతువులు మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేస్తాయని అన్నారు.
నాకు సైనిక అధికారులకంటే కూడా సైనికులు అంటేనే అత్యంత ప్రేమ ఉందని, తాను వారి మనిషినని తెలిపారు.ఇక ఈ ప్రచారాలకి డెమోక్రటిక్ పార్టీనే కారణమని, ఈ ఎన్నికల్లో నేను గెలుస్తానని భావించి నాపై దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.