కరోనా మహమ్మారి చైనా లోని వ్యూహాన్ ల్యాబ్ నుంచీ పుట్టుకొచ్చిందని ప్రపంచం మొత్తం డిసైడ్ అయ్యిపోయింది.కరోనా కారణంగా ఎంతో మంది బలై పోవడానికి కారణం చైనా అంటూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకి కరోనా కారణంగా జరిగిన నష్టాన్ని చైనానే పూడ్చాలని, నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ కూడా చేశాయి.
కానీ డ్రాగన్ కంత్రీ ఇవన్నీ తప్పుడు వార్తలుగా కొట్టి పారేస్తూ వచ్చింది.అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం డ్రాగన్ దేశాన్ని విడిచి పెట్టడం లేదు.
ట్రంప్ తన ప్రతీ ప్రెస్ మీట్ లో చైనాని ఏకి పారేస్తున్నారు.గతంలో కరోనా వైరస్ విషయంలో చైనాపై మాటల యుద్ధం చేసిన ట్రంప్ అప్పట్లో కరోనాకి వ్యూహాన్ వైరస్ అనే పేరు పెట్టారు.
ఈ క్రమంలోనే చైనా ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.కావాలనే బురద జల్లుతున్నారంటూ ప్రకటించింది.కానీ ట్రంప్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు పలు మార్లు చైనాపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.కరోనా వైరస్ కి చైనాని ఊటంకిస్తూ పేర్లు పెడుతూనే ఉన్నారు.
తాజాగా కరోనా వైరస్ కి మరో కొత్త పేరు పెట్టేశారు ట్రంప్.
ఒక్లహామాలో ట్రంప్ తాజాగా నిర్వహించి ర్యాలీలో ట్రంప్ అక్కడికి వచ్చిన వేలాది మంది ప్రజల్ని ఉద్దేశించి చైనాపై మరో సారి మాటల దాడి చేశారు.
కరోనాకి మరో కొత్త పేరు కూడా పెట్టేశారు.చైనా ని టార్గెట్ చేస్తూ కరోనాకి “కుంగ్ ఫ్లూ” అని పేరు పెట్టారు.ఇదొక్కటే కాదు నేను ఇంకా ఇలాంటి పేరు చాలానే పెట్టగాలంటూ అంటూ వ్యాఖ్యానించారు.కుంగ్ ఫ్లూ అనేది చైనాలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రధానమైన విద్య.
దానిపై కామెంట్స్ చేస్తూ ట్రంప్ ఇలాంటి పేర్లు పెట్టడం చైనా మనోభావాలని దెబ్బ కొట్టినట్టే అంటున్నారు నిపుణులు.మరి ఈ విషయంపై చైనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.