ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో అమెరికా ముందు వరుసలో ఉంది.అక్కడ కరోనా కరాళ నృత్యం చేస్తుంది అనేందుకు ప్రత్యక్ష సాక్ష్యం తాజాగా అధ్యక్షుడు ట్రంప్ కరోనా బారిన పడటమే.
ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల్లో బిజీ బిజీగా ఉన్న ట్రంప్ తన ప్రధాన సలహాదారుడు అయిన హోప్ హిక్స్ కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో సాదారణ చెకప్ లో భాగంగా తాను చెక్ చేయించుకున్నారట.ఆ సమయంలో ట్రంప్ కు మరియు ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు కరోనా బారిన పడటం చర్చనీయాంశం అయ్యింది.
కరోనా విషయాన్ని ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
తన ప్రధాన సలహాదారు అయిన హోప్ హిక్స్ విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు.ఆ సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.
ఇది దారుణమైన విషయం.ట్రంప్ మరియు మెలానియా ట్రంప్ కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల ప్రభావం ఉంటుందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ కరోనా ను అమెరికాలో నివారించడంలో విఫలం అయ్యారు అంటూ ప్రత్యర్థులు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.ఇప్పుడు ఆయనే స్వయంగా కరోనా పాజిటివ్ అవ్వడంతో మరింతగా ఆయనపై విమర్శలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది.
వచ్చే నెలలో జరుగబోతున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న ట్రంప్ కు కరోనా రావడంతో ఆయన పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారట.ప్రస్తుతం కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటూ క్వారెంటైన్ లో ఉన్నట్లుగా ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆయన మద్దతుదారులు ప్రార్థనలు చేస్తున్నారు.