కొంతమందికి అదృష్టం కళ్ళ ముందు ఉన్నా దరిద్రం జేబూలో ఉంటుంది అలాంటి వారికి కోట్లు దొరికినా చిత్తు కాగితం అనుకుని పడేస్తారు కూడా.ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి ఇలానే ఉంది.
నవంబర్ లో ఎన్నికలు పెట్టుకుని ప్రచారం చేసుకునేది పోయి ట్రంప్ ఏకంగా ఓట్లేసే ప్రజలపైనే విమర్సలు చేయడం పెట్టారు.అసలే కరోనా ఎఫ్ఫెక్ట్ తో అసలు ఓట్లు పడతాయా లేదా అనే ఆందోళనలో ఉన్న ట్రంప్ వర్గానికి తాజాగా ఘటన పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
ఇప్పటికే ప్రచారంలో వెనుకబడిన ట్రంప్ తాజా ఘటనతో ఇక అధ్యక్ష పీటానికి ఎసరు కొని తెచ్చుకున్నారని అంటున్నారు పరిశీలకులు.ఇంతకీ అసలు ట్రంప్ ఏమి చేశాడు…
ఎన్నికల పచారంలో భాగంగా ఓ మీడియా కి ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్ కరోనా వ్యాక్సి పై అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చాలా ఘాటుగానే ఇచ్చారు.
మీడియాలో మాట్లాడుతున్నాను అనే విషయాన్ని మర్చిపోయిన ట్రంప్ అమెరికన్స్ పై మండిపడ్డారు.కరోనా వ్యాక్సిన్ ముందుగా నేను వేసుకుంటే అదిగో ముందు అధ్యక్షుడు వేసుకున్నాడు ప్రజలకి ఇవ్వకుండా అంటారు.
లేదా చివర్లో వేసుకుంటే అదిగో అది ఎలా పనిచేస్తుందో చూడటానికి చివరిలో వేసుకున్నాడు అంటూ విమర్శలు చేస్తారు.ఈ ప్రజలు అందరూ ఇంతే ఇలానే ఉంటారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే అమెరికా మీడియా ఏకి పారేస్తోంది.ప్రజలు వేసే ఓట్లతో గెలిచిన ట్రంప్ ఇప్పుడు అదే అమెరికన్స్ పై విమర్శలు చేయడం భావ్యం కదాని ట్రంప్ సోదరుడి కూతురు మేరీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమనిపిస్తున్నాయని అంటున్నారు.
ఇప్పటికే ఆమె రాసిన పుస్తకంలో ట్రంప్ ఓ మానసిక రోగి గా ప్రస్తావించగా ఇప్పుడు అదే నిజమని అమెరికా ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.