దేశ రక్షణలో ఆర్మీ జవాన్లు ఎంత కీలక బాధ్యత వహిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అలాగే దేశ రక్షణతో పాటు నేరస్తులను పట్టుకోవడంలో జాగిలాలు కూడా కీలకపాత్ర పోషిస్తూ ఉంటాయి.
వాటికున్న ప్రత్యేకమైన లక్షణాలతో నేరస్తులను సునాయాసంగా గుర్తిస్తాయి.ఈ కారణంగానే ఇండియన్ ఆర్మీలో పనిచేసే శునకాలకు కూడా కీలక పదవులు ఉంటాయి.
అవి చనిపోయినప్పుడు కూడా ఆర్మీ గౌరవ వందనం అందుకున్న తర్వాత దాన్ని సంస్కారాలు చేస్తూ ఉంటారు.ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా శునకాలు కీలకపాత్ర పోషిస్తూ ఉంటాయి.
ఇదిలా ఉంటే తాజాగా కాశ్మీర్లోని ఆర్మీ కమాండర్ శునకానికి సెల్యూట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఆయన సెల్యూట్ అందుకున్న శునకం కూడా తన తిరిగి సెల్యూట్ చేసింది.
అసలు ఆర్మీ కమాండర్ శునకానికి ఇలా సెల్యూట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
లెఫ్ట్నెంట్ జనరల్ తిల్లోన్ అమర్నాథ్ దర్శనం కోసం వెళ్తుండగా ఆర్మీ క్యాంప్ లో ఈ శునకం ఎదురుపడింది.
దీనిని చూసిన అతను కూర్చుని దానికి సెల్యూట్ చేశారు.మేనక అనే పేరున్న ఈ శునకం ఆర్మీ మౌంట్ వెటర్నరీ కాప్స్ సోల్జర్ గా బాధ్యతలు నిర్వహిస్తుంది.
సరిహద్దులో ఇది అనేక రెస్యూ ఆపరేషన్ లో పాల్గొని ఉగ్రవాదులు ఆనవాళ్లను, పేలుడు పదార్థాలను గుర్తించింది.ఈ విషయాన్ని లెఫ్ట్నెంట్ జనరల్ తన ట్విట్టర్ ద్వారా స్వయంగా తెలియజేశారు.
అనేక సందర్భాల్లో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన బుడ్డికి నా సెల్యూట్ అంటూ దానికి క్యాప్సన్ ఇచ్చారు.దీంతో ఆ శునకానికి సోషల్ మీడియాలో ఇప్పుడు నెటిజన్లు కూడా సెల్యూట్ చేస్తున్నారు.