నిన్న సాయంత్రం తెలుగు న్యూస్ ఛానెల్స్ లో ఓ సంచలనాత్మకమైన వార్త టెలికాస్ట్ అయ్యింది.హైదరాబాద్ లో ఫేమస్ బిర్యాని సెంటర్స్ లో ఒకటైన షాగౌజ్ బిర్యాని లో మటన్ వంటకాల్లో మేక మాంసానికి బదులు కుక్క మాంసం వాడుతున్నారని, అధికారుల తనిఖిలో ఈ విషయం వెల్లడైందని, షాగౌజ్ ఓనర్ ని పోలీసులు అరెస్టు చేశారని వార్తల సారాంశం.
షాగౌజ్ కి నగరంలో మూడు బ్రాంచులు ఉన్నాయి.రోజు లక్షల్లో బిజినెస్ జరుగుతుంది.
వేలమంది ప్రతీరోజు షాగౌజ్ బిర్యాని తింటుంటారు.దీంతో నగరవాసులు అందోళనకి లోనయ్యారు.
అయితే మీడియా మోసుకొచ్చిన వార్తల్లో నిజం లేదని రుజువైంది.
GHMC అధికారులు షాగౌజ్ ఎక్కడినుంచి మాంసాన్ని తీసుకొస్తున్నారో తనిఖి చేసారు.
మేక మాంసం తప్ప కుక్క మాసం వంటకాల్లో వాడట్లేదని తేలింది.దాన్ని మీడియా మరోలా రాసింది.
సోషల్ మీడియాలో అదే ఫేక్ న్యూస్ ప్రచారం జరిగింది.
అసలు షాగౌజ్ ఓనర్లపై ఎలాంటి కేసు నమోదవలేదు.
ఇక విషయంపై స్పందించిన షాగౌజ్ యాజమాన్యం, ఎవరో తమ బిజినెస్ ని దెబ్బతీయడానికి చేసిన చర్య ఇది అని, అవాస్తవాలు చెప్పిన ఛానెళ్ళపై చర్య తీసుకునేందుకు పోలీసులని ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు.