ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో టిడిపికి మీద దెబ్బ తగులుతోంది.ఇప్పటికే పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ,ఎంపీలతో పాటు మరికొందరు నేతలు రాజీనామాలు చేయడం బాబుకు షాక్ ఇస్తే తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం అధినేత చంద్రబాబుకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి.
ఈ తరుణంలోనే టిడిపి నేతల పై జరుగుతున్న ఈ దాడులు, అరెస్ట్ వారెంట్ లు పార్టీని తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి.
నిన్న మొన్నటి వరకు సుజనాపై ఈడి దాడులు చేయగా, ఈరోజు ఉదయం కడప జిల్లా మైదుకూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఇ పుట్ట సుధాకర్ పై కూడా ఐటి దాడులు జరిగాయి.
అయితే రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న ఈ పరిణామాలకే టిడిపి లో గందరగోళ పరిస్థితులు నెలకొంటే తాజాగా తెలంగాణా పోలీసులు అరెస్ట్ వారెంట్ పట్టుకుని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వల్లభనేని వంశీ ని అరెస్ట్ చేయడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.
ఇదిలాఉంటే 2009లో వంశీ పై నమోదైన ఒక కేసుకు సంభందించి ఇప్పుడు కోర్ట్ నుంచీ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.అప్పట్లో తనకి రక్షణ లేదంటూ ఆరోపించిన వంశీ తనకు తానునగా ప్రైవేటు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు.ఆ సమయంలో ఆయన నివాసంలో అక్రమంగా ఉంచిన ఆయుధాలు దొరికాయంటూ ఆయన పై కేసు నమోదైంది.
ఈ విషయంపై సుదీర్ఘ విచారణ జరిగిన తరువాత తనపై కేసు కొట్టివేయాలని వంశీ క్వాష్ పిటీషన్ ను దాఖలు చేశారు.దాంతో అప్పట్లో జారీ అయిన అరెస్ట్ వారెంట్ తో పాటు కేసుని కూడా కొట్టేసింది కోర్టు.
కానీ ఇప్పుడు నాంపల్లి కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్లు ఏపీతో పాటు టీడీపీలో కలకలమే సృష్టిస్తున్నాయి.
అయితే ఇదే సమయంలో నాంపల్లి కోర్టులో ఈకేసుకి సంభందించి వంశీ హాజరు కాలేదు.
ఈ విషయాన్నే హైలెట్ చేసిన తెలంగాణా పోలీసులు వంశీ కోర్టుకు హాజరు కాలేదనే కారణంతో కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.దాంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
అయితే.ఎన్నికలు ముంచుకొస్తున్న సమయమూ ఈ రకమైన సంఘటనలు పార్టీకి తీరని మచ్చ తీసుకువస్తాయని ఆందోళన చెందుతున్నారు టీడీపీ నేతలు.