తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్న సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన షర్మిల ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే.తెలంగాణలో అరాచక పాలన నడుస్తున్నదని, తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని షర్మిల అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే.
అయితే షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తున్నదని ఓ పత్రిక కథనంతో వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.అయితే ఆ కథనానికి బలం చేకూరుస్తూ షర్మిల స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ తరువాత జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ ఏర్పాటు పట్ల నేతల అభిప్రాయాలను స్వేకరించిన విషయం తెలిసిందే.అయితే పార్టీ ఏర్పాటు ప్రకటిస్తానని చెప్పి ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే.
అయితే ఆ సభలో పార్టీ పేరు ప్రకటనను వాయిదా వేసిన వేసిన షర్మిల, ఆ తరువాత నిరుద్యోగులకు తక్షణమే నోటిఫికేషన్ లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 72 గంటల నిరాహార దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే.అయితే దీక్షతో కొంత మేర అలజడి సృష్టించినా నిరుద్యోగులు మాత్రం ఆ దీక్షను నమ్మలేదు.
అంతేకాక ఏ ఇతర పార్టీ నేత కూడా షర్మిలకు మద్దతుగా మాట్లాడలేదు.అయితే ఎంతో ఊహించుకొని తెలంగాణ రాజకీయాలలోకి వచ్చిన షర్మిల తెలంగాణ ప్రజల నుండి స్పందన కరువైంది.
అయితే ప్రజలు పట్టించుకోక, మీడియా కూడా పట్టించుకోకపోవడంతో షర్మిల ఇప్పుడు రాజకీయ సహాయం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.