ప్రతి మనిషి జీవితంలో చావు అనేది కచ్చితంగా వస్తుంది.అయితే అది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పడం ఎవరి తరం కాదు.
పలానా రూపంలో వస్తుందని చెప్పడం కష్టం.అది వచ్చిందంటే ప్రాణం విడిచిపెట్టాల్సిందే.
అయితే ఈ మధ్య వస్తున్న చావుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.ఎందుకంటే ఎవరూ ఊహించని విధంగా ఈ నడుమ చాలామంది చనిపోతున్నారు.
అసలు ఇలా కూడా మరణం వస్తుందా అని ప్రతి ఒక్కరూ షాక్ అవుతూనే ఉన్నారు.కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అనుకోని రూపంలో చావు వెంటాడుతోంది.
చాలామంది రోడ్ల పక్కన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడో ఊడిపడ్డ లారీ టైర్లు వచ్చి తగిలి చనిపోతున్న ఘటనలు చూస్తున్నాం.ఇప్పుడు కూడా ఇలాంటి అనుకోని రూపంలో ఓ అమ్మాయి చనిపోయింది.
ఎనిమిది మంది ఫ్రెండ్స్ కలిసి ఏపీలోని రావులపాలెంలో జరుగుతున్న తమ స్నేహితురాలి వివాహానికి అటెండ్ అయ్యారు.ఇలా వచ్చిన వారంతా కూడా వల్లభనేని లోహిత్ రాణి ఊరు అయిన గౌరీపట్నంలో నైట్ ఉన్నారు.
ఇక మార్నింగ్ మారేడుమిల్లికి విహారయాత్రకు అంతా కలిసి ఒకే కారులో బయలుదేరారు.
ఇలా వెళ్తున్న క్రమంలో కారులోంచి హాయిగా చల్లగాలి వస్తుందని లోహిత్ రాణి కిటికి నుంచి తల పెట్టేందుకు ప్రయత్నించింది.అయితే జాగ్రత్త అంటూ స్నేహితులు హెచ్చరిస్తూనే ఉన్నారు.ఇలా ఆమె తల బటయకు పెట్టిందో లేదో ఇంతలోనే కారు రోడ్డు అంచు దిగిపోయింది.
ఇక రోడ్డుకు దగ్గరే ఉన్న స్తంభానికి ఆమె తల బలంగా తాకి స్పృహ తప్పిపోయింది.ఇక ఆమెను దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పేశారు.
దీంతో ఆ స్నేహితులు తీవ్రంగా రోదించారు.ఎవరూ ఊహించని విధంగా మరణం రావడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
.