కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.అటు ఆరోగ్యపరంగా.
ఇటు ఆర్ధిక పరంగా కూడా అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు.కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నారు.
వైద్య సిబ్బంది అయితే తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాల్ని కాపాడే ఉద్దేశ్యంతో నిద్రాహారాలు మాని మరి నిత్యం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.కరోనాను అదుపులో ఉంచడానికి వాక్సిన్ సైతం అందుబాటులోకి తెచ్చారు.
ఈ క్రమంలో ఒక పక్క కరోనా రోగులకు చికిత్స అందిస్తూనే మరోపక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.అయితే పట్టణాల్లో, గ్రామాల్లో ఉండే ప్రజలకు వాక్సిన్ అందుబాటులో ఉంటుంది కానీ కొండల ప్రాంతాల్లో నివసించే ప్రజల పరిస్థితి ఏంట ? ఒక్కసారి ఆలోచించండి.ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో కొండ ప్రాంతాల్లో చాలామంది ప్రజలు నివాసం ఉంటున్నారు.వాళ్ళు కొండ ప్రాంతం నుంచి పట్టణాల్లోకి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవడం అనేది కుదరని పని.అయితే కొంతమంది ఆరోగ్య సిబ్బంది కొండలు, గుట్టలు, నదులు దాటుకుంటూ కొండ ప్రాంతంలోని ప్రజలకు వాక్సిన్ వేయడానికి పయనం అయ్యారు.దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
తాజాగా జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ జిల్లా త్రాళ్ల గ్రామంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయాలను వైద్య సిబ్బంది బయలుదేరారు.కాకపోతే ఆ గ్రామానికి చేరుకోవాలంటే అంత సులువు కాదు.
ఎందుకంటే.
వారు వెళ్లాల్సిన మార్గమధ్యంలో ఒక నదిని దాటి ఆ గ్రామానికి చేరాలి. కానీ వైద్య సిబ్బంది అవేమి లెక్క చేయకుండా త్రాళ్ల గ్రామానికి వెళ్లేందుకు బయలుదేరగా ఉన్నటుండి నది ఉధృతంగా ప్రవహించడం మొదలు పెట్టింది.మొదట్లో నది దాటేందుకు వైద్య సిబ్బంది భయపడినాగాని తర్వాత దైర్యం చేసి నదిని దాటారు.
వీళ్ళలో ఒక మహిళ వైద్యురాలు కూడా ఉంది.ఆమె నది దాటుతూ పడిపోతున్న సమయంలో ఆమెకు మరో వైద్యుడు సాయం చేశాడు.
ఈ దృశ్యాలను త్రాళ్ల హెల్త్ సెంటర్ ఇంచార్జి డాక్టర్ ఇరామ్ యాస్మిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైద్యులు చేస్తున్న సేవకు అందరు వాళ్ళని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.