ప్రెస్బియోపియా .ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? సైంటిఫిక్ పేరు చెబితే అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కాని, సాధారణ భాషలో చెప్పాలంటే కంటిచూపు దెబ్బతినటం.దగ్గరున్న వస్తువులు కూడా సరిగా కనిపించకపోవడం, కనులు బరువుగా అనిపించటం .ఇలాంటివి అన్నమాట.ఈ కండీషన్ సాధారణంగా 40-50 ఏళ్ళ వయసులో మొదలవుతుంది (అందరికి కాదు).కాని మొబైల్ ఫోన్ల వలన ప్రెస్బియోపియా అంతకన్నా ముందే వచ్చే ప్రమాదం పెరిగిపోతోందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్టు ప్రకారం 2005 వరకు ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది ఈ సమస్యతో ఇబ్బందితో బాధపడేవారట.ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల రాకతో పది సంవత్సరాల్లో ఈ సంఖ్య డబుల్ అయిందట.
మనదేశం గురించి చెప్పాలంటే, ప్రెస్బియోపియాతో ఇబ్బందిపడుతున్న వారిలో 65% మంది ఇంకా 30-35 ఏళ్ళ వయసులోనే ఉన్నారట.ఇక మీరే అర్థం చేసుకోండి .మన యువతను ఎంత పెద్ద ప్రమాదంలో ఉందో.
అంటే .దురదృష్టం కొద్ది 50 ఏళ్ళ వరకు రావాల్సిన సమస్యని, ఓ 20 ఏళ్ళ ముందుగానే కష్టపడి మరి కొనితెచ్చుకుంటున్నాం అన్నమాట.రాబోయే తరం 20-25 సంవత్సరాల వయసులోనే ఈ సమస్యని చూస్తారేమో!
.