పేరుకి డాక్టర్లు కాని, మనిషి ప్రాణం పోయిందో, ఊపిరితో కొట్టుమిట్టాడుతుందో చెప్పలేని పరిస్థితి వారిది.వారి మాటలు నమ్మి కేవలం ఓ వారం వయసు ఉన్న శిశువుని కాటిలో కాల్చబోయారు తల్లిదండ్రులు.
ఈ వింత సంఘటన నిన్న కర్ణాటక, హుబ్లీ జిల్లాలోని దేవికొప్ప గ్రామంలో జరిగింది.
విషయంలోకి వెళితే, దేవికొప్ప గ్రామానికి చెందిన ఫక్కిరప్ప, నేత్రావతి దంపతులకి వారం క్రితం ఓ ఆడపిల్ల సంతానంగా లభించింది.
అయితే శిశువు ఆరోగ్యం సరిగా లేనందున ధార్వాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ చికిత్సం కోసం తీసుకెళ్ళారు.చికిత్స మొదలుపెట్టిన డాక్టర్లు కాసేపటికి శిశువు మృతిచెందిందని నిర్థారించేసరికి ఆ తల్లిదండ్రులకు శోకం మిగిలింది.
విధి మిగిల్చిన విషాదం అని, ఆ చిన్నారిని స్మశానానికి తీసుకెళ్ళారు.అంతక్రియలు మొదలుపెట్టబోతుండగా శిశువులో కదలికలు కనిపించాయి.
ప్రాణం ఉండటంతో వెంటనే హుబ్లీలోని కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.అక్కడి డాక్టర్లు ప్రస్తుతం శిశువుని ఐసియూలో పెట్టి చికిత్స అందిస్తున్నారు.
చూశారుగా .ఎంత గొప్ప డాక్టర్లు మన దేశంలో తిరుగుతున్నారో!
.