సోషల్ మీడియా పుణ్యమా అని రోజుకొక్క వీడియో సంచలనంగా మారుతుంది.ఎక్కడో ఒక చోట కొన్ని ఘటనలు చోటుచేసుకోవడం అవి సోషల్ మీడియా లో వైరల్ కావడం సహజమైపోతుంది.
ఇప్పుడు తాజాగా ఒక డాక్టర్ పేషేంట్ పై చేయి చేసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
రాజస్థాన్ లోని సవాయిమన్ సింగ్ మెడికల్ హాస్పటల్ లోని డాక్టర్ సునీల్ హాస్పిటల్ కు వచ్చిన రోగిని చితక బాదారు.ఎదో విషయం వద్ద వారిద్దరికీ వాగ్వివాదం చోటుచేసుకోవడం తో కంట్రోల్ తప్పిన వైద్యుడు రోగి అన్న జాలి కూడా లేకుండా చితక్కొట్టాడు.
అయితే ఈ తతంగాన్ని అంతా కూడా అక్కడ ఉన్న వారు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.
మరోపక్క ఈ ఘటనపై అక్కడి మానవహక్కుల కమీషన్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది.అలానే ఆ రాష్ట్ర వైద్య శాఖామంత్రి కూడా ఈ ఘటన పై వివరణ ఇవ్వలసిందిగా హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు.అసలు రోగిపై ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చింది,కారణం ఏంటి అన్న వివరాలు మాత్రం తెలియలేదు.
ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సామజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది.ఈ వీడియో చూసిన అందరూ కూడా రోగిని డాక్టర్ ఆ విధంగా చితక్కొట్టడం ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు
.తాజా వార్తలు