సెల్ఫీ మోజులో పడి పేషెంట్ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కొందరు డాక్టర్లు.ఒక వైపు మహిళ ప్రసవ వేదనతో బాధ పడుతుంటే బాధ్యత మరచిన డాక్టర్లు సెల్ఫీ తీసుకుంటూ.
ఆ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.ఈ దుర్ఘటన ఒరిస్సా లో చోటుచేసుకుంది.వివరాల లోకి వెళ్తే…
కోరాపుట్ జిల్లా ఆసుప్రతిలో ఓ గర్భిణీ మహిళకు డాక్టర్ల బృందం ఆపరేషన్ చేస్తున్న సమయంలో మరో డాక్టర్ తన మొబైల్తో సెల్ఫీ తీసుకున్నారు.తర్వాత ఆ ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
దీంతో ఆ డాక్టర్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పలు విమర్శలు రావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని సూపరింటెండెంట్ను కోరారు.విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు