పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రవితేజ హీరో గా వచ్చిన ఇడియట్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మన అందరికీ తెలిసిందే.రవితేజ కెరియర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పిన సినిమా ఇది అప్పటి వరకు అటు హీరోగా, ఇటు విలన్ గా వేషాలు వేసుకుంటూ ఉన్న రవితేజ ఈ సినిమాతో ఫుల్ టైం హీరోగా మారిపోయాడు ఈ సినిమా లో రవితేజ చెప్పిన డైలాగ్స్ సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తు ఉంటారు పోతు ఉంటారు కానీ చంటిగాడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు లోకల్, కమిషనర్ కుతుర్లకి పెళ్లిళ్లు కావా వాళ్ళకి మొగుళ్ళు రారా అనే డైలాగ్స్ ని ఇప్పటికీ మనలో చాలా మంది చెప్తూనే ఉంటారు.
లవ్ స్టోరీస్ లో ఇదొక మైలురాయి సినిమా అనే చెప్పాలి అయితే పూరి జగన్నాథ్ రవితేజ కంటే ముందు ఈ సినిమాకి హీరోగా పవన్ కళ్యాణ్ ని అనుకున్నారు కానీ ఈ స్టోరీ పవన్ కళ్యాణ్ గారికి నచ్చకపోవడంతో ఆయన ఈ స్టొరీ ని వదిలేశారు.పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేయడంతో పూరి డైరెక్ట్ గా హీరో సుమంత్ దగ్గరికి వెళ్ళి ఆయనకి స్టోరీ చెప్తే ఈ స్టోరీ తనకి నచ్చక వదిలేశారు…
దాంతో విసిగిపోయిన పూరి ఈ సినిమాకంటే ముందే రవితేజ తో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా తీసి సక్సెస్ కొట్టడంతో మళ్ళీ రవితేజ తోనే ఈ సినిమా చేయాలి అనుకొని రవితేజని పెట్టి సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు…దాంతో రవితేజ ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయాడు…ఇప్పటికీ అటు రవితేజ ఇటు పూరి జగన్నాథ్ కెరియర్ లో ఇదే ది బెస్ట్ సినిమా అని చెప్తారు…
అలా పవన్ కళ్యాణ్ తో పాటు సుమంత్ కూడా ఈ సినిమాని మిస్ చేసుకున్నాడు.సుమంత్ ఈ సినిమా చేసి ఉంటే ఆయన కెరియర్ ఇంకోలా వుండేది అని అక్కినేని ఫ్యాన్స్ ఇప్పటికి అనుకుంటూ ఉంటారు.ఇప్పుడు హీరోగా సుమంత్ కెరియర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే…అయితే పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ తో తన మొదటి సినిమా అయిన బద్రి తీసి హిట్ కొట్టాడు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కి ఇడియట్ సినిమా పడి ఉంటే ఆయన సినిమాల హిట్ లిస్ట్ ఇంకా పెరిగి ఉండేదని అతని ఫ్యాన్స్ ఇప్పటికీ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు.
అయితే తనకి ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తో మళ్ళీ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేసి మంచి విజయాన్నే అందుకున్నాడు…
.