ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ చెందిన హీరోలు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా వివిధ సినీ ఇండస్ట్రీలో కూడా వారి సినిమాలను విడుదల చేసేందుకు కథలను అందుకు తగ్గట్టుగా ఎంచుకొని సినిమాలో నటిస్తున్నారు.ఇప్పుడు టాలీవుడ్ లో అనేక మంది హీరోలు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు.
కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలలో వారి మార్కెట్ పెంచుకోవడానికి బాగా ట్రై చేస్తున్నారు.ఇకపోతే కొన్ని సందర్భాలలో బాలీవుడ్ హీరోల కంటే టాలీవుడ్ హీరోలు ఏ మాత్రం తగ్గకుండా వారిని బీట్ చేసి ముందుకు వెళ్తున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళితే…
2020 సంవత్సరం అత్యంత స్టైలిష్ మ్యాన్ ఎవరైనా ఉన్నారని అడగగా చాలామంది బాలీవుడ్ హీరో రన్ వీర్ సింగ్ అని అంటుండగా మరికొందరు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, ఆ తర్వాత విజయ్ దేవరకొండ వీరితోపాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేర్లు వరుసగా వినిపిస్తున్నాయి.ఇక ఈ అంశంపై తాజాగా ప్రముఖ మ్యాగజైన్ సంస్థ జిక్యూ దేశంలోని ప్రముఖ స్టైలిష్ వ్యక్తులను సంబంధించి ఓ జాబితాను విడుదల చేసింది.
ఇందులో భాగంగానే ఇన్నోవేషన్, అలాగే స్టైల్ తో కూడిన యూత్ గా ఐకాన్ బాలీవుడ్ హీరో రన్ వీర్ సింగ్ ను ప్రకటించింది.ఈయన కేవలం భారత దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా యూత్ ఐకాన్ గా రికార్డులకెక్కాడు.
రన్ వీర్ సింగ్ సంబంధించి విషయం ఇలా ఉండగా… మరో వైపు టాలీవుడ్ హీరోలు అయిన అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఆయనకు ఎక్కడ తగ్గకుండా వారి స్థాయిలో, వారి స్టైల్ మెయింటైన్ చేస్తూ వీరు కూడా నిలపడ్డారు.టాలీవుడ్ హీరోలు కూడా స్టైల్ ఎక్కడ తక్కువ కాకుండా మెయింటైన్ చేస్తున్న కానీ వారికి పాన్ ఇండియా స్థాయిలో ఎక్కువ క్రేజ్ లేకపోవడంతో వెనుక పడాల్సి వచ్చింది.ముఖ్యంగా ఇలాంటి వాటిలో ప్రముఖ స్థానం పొందాలి అంటే కచ్చితంగా ఆ హీరోలు పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న వారు అయితేనే వారికి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.అలాంటి వారికి ఈ ప్రముఖ స్టైలిష్ అవార్డ్ చేజిక్కించుకోగలరు.
చూడాలి మరి మన టాలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా సినిమాలో నటించడం ద్వారా వచ్చే సంవత్సరం అయినా సరే ఇలాంటి అవార్డులు గెలుస్తారో లేదో.