ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వారి జీవనం కోసం ఏవేవో పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తు ముందుకు సాగుతున్నారు.అయితే ఇలా డబ్బులు సంపాదిస్తున్న వారిలో చాలామంది ఇతరుల కోసం కూడా వారు సంపాదించిన సొమ్మును కొద్దిమేర సహాయం చేస్తుండటం మనం అప్పుడప్పుడు చూస్తూవుంటాం.
అంతేకాదు మన చుట్టుపక్కల వారిలో, లేదా మనకు తెలిసిన వారు కూడా చాలా మంది పేదలకు అనేక రకాలుగా సహాయం చేయడం గమనిస్తూనే ఉంటాం.ఇక అసలు విషయంలోకి వెళితే.
గడిచిన వంద సంవత్సరాలలో ఎక్కువగా దానం చేసిన వారి లిస్ట్ ఓసారి చూద్దామా.
ప్రపంచవ్యాప్తంగా గత శతాబ్దానికి సంబంధించిన విరాళాలపై హహరూన, ఎడెల్గేవ్ ఫౌండేషన్ లు కలిసి ఓ నివేదికను రూపొందించారు.
ఇందులో మొత్తం 50 మందికి చోటు దక్కగా 37 మంది ఇప్పటికే మరణించారు.కేవలం 13 మంది మాత్రమే జీవించి ఉన్నారు.
ఇక గడిచిన వంద సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా విరాళం ఇచ్చి మొదటి స్థానంలో నిలిచింది మన భారతీయుడు జెంషెట్జీ టాటా.టాటా గ్రూప్ మొదలు అయినప్పటి నుండి నుంచి సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని.
గడిచిన 100 సంవత్సరాలలో పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు ‘జెంషెట్ జీ టాటా’ మొత్తంగా 102 బిలియన్ డాలర్లను సేవాకార్యక్రమాలకు వినియోగించారని స్పష్టం చేశారు.
ఇక ఈ లిస్టులో టాటా తర్వాత మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బబిల్గేట్స్ చేరుతారు.ఆయన మాజీ భార్య మెలిందా సంయుక్తంగా రెండవ స్థానంలో నిలిచారు.వీరు ఇద్దరూ కలిసి 74.6 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు నివేదిక తెలుపుతోంది.
ఇక ఆ తర్వాత మొత్తం 37.4 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్.ఆ తర్వాత నాలుగో స్థానంలో సోరస్ 34.8 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు.ఆ పై జాన్ డీ రాక్ ఫెల్లర్ 26,8 బిలియన్ డాలర్లు విరాళంగా 5వ స్థానములో నిలిచారు.