దిల్ రాజు ప్రొడ్యూసర్ గా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన కొత్త బంగారు లోకం సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో మనందరికీ తెలిసిందే.ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరో గా శ్వేత బసు ప్రసాద్ హీరోయిన్ గా నటించింది… అయితే ఈ సినిమాలో హీరో గా వరుణ్ సందేశ్ కంటే ముందే దిల్ రాజు శ్రీకాంత్ అడ్డాల కలిసి నాగచైతన్య అయితే ఈ స్టోరీ కి సెట్ అవుతాడని అనుకొని నాగార్జున గారిని కలిసారట అయితే అప్పటికి నాగచైతన్య ఇంకా హీరో గా ఎంట్రీ ఇవ్వలేదు.
అందుకని నాగార్జున నాగ చైతన్యని ఒక మాస్ సినిమా తో పరిచయం చేయించాలనే ఆలోచనలో ఉన్న ఇది చాలా క్లాస్ సినిమా కదా మాస్ స్టోరీ ఉంటే తీసుకు రండి మీ బ్యానర్ లోనే సినిమా చేద్దాం అని చెప్పారట దాంతో దిల్ రాజు ఇంకో హీరో కోసం వెతుకుతున్న ప్రాసెస్ లో శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ సినిమాలో మోయిన్ రోల్ చేసిన వరుణ్ సందేశ్ ని చూసి ఇతనైతే బాగా సెట్ అవుతాడని అనుకొని డైరెక్టర్ కి చెప్పి అతనికి వరుణ్ సందేశ్ ని చూపించి అతను ఒకే అన్నాక వరుణ్ సందేశ్ ని హీరో గా తీసుకున్నారు.
ఈ సినిమా చిన్న సినిమా గా వచ్చి పెద్ద హిట్ అయింది.అలా నాగ చైతన్య ఒక మంచి హిట్ సినిమాని మిస్ చేసుకున్నాడు… ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లోనే వాసు వర్మ దర్శకత్వం లో నాగ చైతన్య హీరోగా వచ్చిన జోష్ సినిమా ప్లాప్ అయింది.నాగ చైతన్య కనక కొత్త బంగారు లోకం సినిమాతో ఎంట్రీ ఇస్తే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండేదని ఇప్పటికీ ఆయన అభిమానులు భాద పడుతా ఉంటారు…జోష్ సినిమా ప్లాప్ అయినా ఆ తర్వాత వచ్చిన ఏమాయ చేసావే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు…లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన థాంక్యూ సినిమా ఫ్లాప్ అయింది దాంతో ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే ఉదేశ్యం తోప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు అలాగే పరుశురాం డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు…