కార్తీకమాసంలో ఏ రోజు ఏం దానం చేయాలో తెలుసా?

కార్తీకమాసం మొదలవడంతో భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలకు చేరుకుని స్వామివారి దర్శన భాగ్యం చేసుకుంటారు ఏదైనా శుభకార్యాలకు, గృహప్రవేశలకు ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది.ఈ మాసంలో పూజలు, వ్రతాలు ఆచరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని విశ్వాసం.

 Do You Know What To Donate On Any Day In The Kartikmasam,karthimasam Speciality,-TeluguStop.com

అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో కొన్ని దానధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.అయితే ఏ రోజున ఎటువంటి వస్తువులు ధానం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

*కార్తీక మాసం మొదటి రోజు: నెయ్యి, బంగారాన్ని దానం చేయాలి.

*రెండవ రోజు: కలువ పూలు, నూనె, ఉప్పు ఇతరులకు దానం చెయ్యాలి.

*మూడవరోజు: కార్తీక మాసం మూడో రోజు పార్వతి దేవిని పూజిస్తారు.ఈ రోజు ఉప్పును ఇతరులకు దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది.

*నాలుగో రోజు: కార్తీక మాసంలో 4వ ఈ రోజైన చతుర్దశి రోజు నాగుల చవితి గా జరుపుకుంటారు.అలాగే వినాయకుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు.

కార్తీక మాసం నాలుగవ రోజు పెసరపప్పును దానం చేయాలి.

*ఐదవ రోజు: కార్తీక మాసంలో వచ్చే 5వ రోజున జ్ఞాన పంచమి అని పిలుస్తారు.ఈరోజు ఆ ఆదిశేషుని పూజించి, పాలను దానం చేయాలి.

*ఆరవ రోజు: ఈ రోజున సంతానంలేనివారు ఎర్రటి కండువాను బ్రహ్మచారికి దానం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది.

*ఏడవ రోజు: కార్తీక మాసంలో 7వ రోజు దుర్గా దేవిని పూజించాలి.ఎర్రటి వస్త్రములో కొద్దిగా గోధుమలను మూటకట్టి ఇతరులకు దానం చేయడం ద్వారా ఆయుష్సు పెరుగుతుంది.

*ఎనిమిదవ రోజు: ఈరోజు గోపూజ నిర్వహించి, ఇతరులకు బియ్యాన్ని దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.

*తొమ్మిదవ రోజు: కార్తీకమాసంలో ఈ రోజున ఆ విష్ణు భగవానుని పూజించి, ఎర్రటి కంది పప్పును దానం చేయాలి.

*పదవరోజు: కార్తీకమాసంలో పదవరోజు నూనెను, దానం చేయటం వల్ల ఆరోగ్యం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

*పదకొండవ రోజు: కార్తీక మాసంలో ఈ రోజు శివుని ప్రత్యేకమైన పూజలతో పూజిస్తారు.ఈ రోజున పండ్లను దానం చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.

*పన్నెండవ రోజు: కార్తీక మాసంలోఈ రోజు ఉసిరి, తులసి చెట్టు వద్ద ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు.ఈరోజు పాల పదార్థాలను దానం చేయడం ఎంతో మంచిది.

*పదమూడవ రోజు: కార్తీక మాసంలో ఈరోజు కొన్ని ప్రాంతాలలో వనభోజనాలకు వెళ్లి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.ఇటువంటి రోజున బియ్యాన్ని దానం చేయడం ఎంతో శ్రేయస్కరం.

*పధ్నాలుగోవ రోజు: కార్తీక మాసంలో ఈ రోజు యమధర్మరాజును పూజించి దున్నపోతు లేదా గేదెను దానంగా ఇస్తారు.

*పదిహేనవ రోజు: కార్తీక మాసంలో ఈ రోజు ఎంతో ముఖ్యమైనది.కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని నదీస్నానమాచరించి, దీపాలు వెలిగించడం ద్వారా సర్వపాపాలు తొలగిపోతాయి.

ఈరోజు సాయంత్రం నదిలో దీపాలను చంద్ర దర్శనం తర్వాత ముత్తయిదువులు ఒకరికొకరు తాంబూలాలను ఇచ్చిపుచ్చుకుంటారు.ఈ విధంగా కార్తీక పౌర్ణమిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube