ఎంతో అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వస్తే అప్పటి నుండి కలహాలు ప్రారంభమవుతాయి.ఈ మధ్య వివాహేతర సంబంధాలు ఎక్కువవుతున్నాయి.
అక్రమ సంభంధాల కారణంగా భర్తను భార్యను చంపడమో లేదా భార్య భర్తను చంపడమో చేసుకుంటున్నారు.సరిగ్గా ఇలాంటి ఘటనే నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.
జనవరి 11న నల్గొండ తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.ఈ కేసు గురించి పోలీసులు దర్యాప్తు చేసి ఇది హత్య అని నిరూపించారు.
వివరాలు సర్వారం గ్రామానికి చెందిన రామకృష్ణ అదే గ్రామానికి చెందిన మమత ఆరు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.
రామకృష్ణకు మొబైల్ షాప్ ఉంది.దానితో పాటు చిట్టీల వ్యాపారం కూడా చేస్తుంటాడు.
వీరికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు.అయితే మమత ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని భర్తతో సంతోషంగా గడపకుండా వేరే వ్యక్తితో అక్రమ సంభందం పెట్టుకుంది.
రామకృష్ణ స్నేహితుడైన రాజశేఖర్ తో మమత అక్రమ సంభందం పెట్టుకుంది.
ఈ విషయం భర్త రామకృష్ణకు తెలిసి మమతను చాలాసార్లు హెచ్చరించాడు.
అయినా వీరిద్దరి ప్రవర్తనలో మార్పు రాలేదు.వీరికి అడ్డుగా ఉన్నాడని భావించిన మమత, రాజశేఖర్ రామకృష్ణను చంపాలనుకున్నారు.
అందుకు ఒక ప్లాన్ కూడా వేశారు.
రామకృష్ణకు రాజశేఖర్ జరిగిందంతా మర్చిపోదాం అని మాయమాటలు చెప్పి ఫుల్లుగా మద్యం తాగించాడు.
తర్వాత తన ప్లాన్ ప్రకారం మమత పిల్లలకు పాలలో నిద్రమాత్రలు వేసి తాగించింది.ఆ రాత్రి మద్యం మత్తులో ఉన్న రామకృష్ణను మమత, రాజశేఖర్ కలిసి హత్య చేసి మృతదేహాన్ని బాత్రూమ్ లో తీసుకెళ్లి పడేసారు.
తర్వాత భర్త గుండెపోటుతో చనిపోయాడని అందరిని నమ్మించింది మమత.అయితే ఇటీవల మమతకు అత్తమామలకు మధ్య గొడవ జరిగింది.ఈ గొడవలో అసహనానికి గురైన మమత మీ అబ్బాయిని చంపినట్లే మిమ్మల్ని కూడా హత్య చేయిస్తానని బెదిరించింది.మమత ఆ విషయం చెప్పడంతో రామకృష్ణ తల్లిదండ్రులు షాక్ అయ్యారు.
ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఎస్పీ ఏ.వి.రంగనాథ్కు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు రంగంలోకి దిగి మమతను విచారించగా ఆమె గుట్టు రట్టయింది.
మమత, ప్రియుడు రాజశేఖర్ మధ్య జరిగిన కాల్ సంభాషణను పరిశీలించిన పోలీసులు రామకృష్ణది హత్యగా నిర్దారించి వారిద్దరిని అరెస్ట్ చేసారు.