వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరిలోనూ బద్ధకం, ఆకలి రెండూ విపరీతంగా పెరిగి పోతుంటాయి.ఈ రెండింటి కారణంగా వ్యాయామాలను, డైట్ను పక్కన పెట్టేసి.
ఏ ఫుడ్స్ పడితే ఆ ఫుడ్స్ ను లాగించేస్తారు.అలాగే వాతావరణం చల్లగా ఉండటం వల్ల వాటర్ను కూడా తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడురు.
ఫలితంగా శరీర బరువు అమాంతం పెరుగుతుంది.అయితే వ్యాయామాలు చేసినా చేయకపోయినా ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను డైట్లో చేర్చుకుంటే గనుక మీ శరీర బరువు అదుపులోనే ఉంటుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆహారాలు ఏంటో చూసేయండి.
జామ.
తక్కువ ధరకే లభించే ఈ రుచికరమైన పండ్లలో ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు మెండుగా ఉంటాయి.ముఖ్యంగా వింటర్ సీజన్లో జామ పండ్లను తింటే.
అందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థ పని తీరును చురగ్గా మార్చి శరీర బరువును అదుపులోకి తెస్తుంది.
అలాగే చలి కాలంలో బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయడానికి బచ్చలికూర సూపర్గా సహాయపడుతుంది.
వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు బచ్చలి కూరను తింటే గనుక చక్కగా వెయిట్ లాస్ అవుతారు.
వింటర్లో శరీర బరువు అదుపులో ఉండాలంటే ఖచ్చితంగా దాల్చిన చెక్కను రెగ్యురల్ డైట్లో చేర్చుకోవాలి.ముఖ్యంగా దాల్చిన చెక్క పొడి వేసి మరిగించిన నీటిని రోజూ ఉదయాన్నే తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.అదే సమయంలో దాల్చిన చెక్క తీసుకుంటే చలిని తట్టుకునే శక్తి సైతం పెరుగుతుంది.
ఇక వీటితో పాటు క్యారెట్, క్యాబేజ్, సిట్రస్ ఫ్రూట్స్, మెంతి గింజలు, ఎండు మిర్చి, మిరియాలు, యాలకులు వంటి వాటిని కూడా డైట్లో చేర్చుకోవాలి.తద్వారా శరీరంలో కొవ్వు కరిగే ప్రక్రియ వేగ వంతం అవుతుంది.
ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.