నందమూరి తారకరత్న ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారారు.ఈయన పాదయాత్రలో భాగంగా స్పృహ తప్పి పడిపోవడంతో గుండెపోటుకు గురై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఎంతోమంది తారకరత్న సినీ కెరియర్, పర్సనల్ విషయాల గురించి కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇలా తారకరత్న సినీ కెరియర్ గురించి మనకు తెలిసిందే.అయితే ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే…
ఈయన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భార్య సొంత చెల్లెలి కుమార్తె అలేఖ్య రెడ్డిని ప్రేమించే పెళ్లి చేసుకున్నారు.
అయితే వీరి ప్రేమలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయని వీరి ప్రేమ వివాహం అచ్చం సినిమాని తలపిస్తుందని చెప్పాలి.అలేఖ్య రెడ్డి ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసేవారు.
అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అలేఖ్య తన ప్రేమ విషయం గురించి చెప్పకు వచ్చారు.తారకరత్న చెన్నైలో అలేఖ్య సోదరి చదివే స్కూల్లో తన సిస్టర్ కు సీనియర్ అని తెలిపారు.
అలేఖ్య, తారకరత్న ఇద్దరు కూడా ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసారు.ఇలా వీరిద్దరు మొదటిసారి హైదరాబాదులో కలిసారని తెలియజేశారు.మొదట మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది.ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని మొదట తారకరత్న తనకు ప్రపోజ్ చేశారని అలేఖ్య తెలిపారు.
ఈ విధంగా తనకు ప్రపోజ్ చేయడంతో తాను ఎస్ చెప్పానని అయితే ఈ విషయం మా ఇంట్లో వారికి చెప్పగా ఇంట్లో వారెవరు ఒప్పుకోలేదని అలేఖ్య తెలిపారు.
మా పెళ్ళికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడానికి గల కారణం కేవలం తారకరత్న సినీ ఇండస్ట్రీకి చెందినవారు కావడమే కారణం.అదేవిధంగా నందమూరి ఫ్యామిలీలో కూడా వీరి పెళ్లికి ఒప్పుకోలేదని తెలిపారు.అందుకు కారణం తనకు ఇదివరకే పెళ్లి జరిగి విడాకులు తీసుకోవడమేనని తెలిపారు.
ఆ సమయంలో మా అంకుల్ విజయ్ సాయి రెడ్డి నాకు మద్దతుగా తెలిపారు.మేము 2012 ఆగస్టు 2 న సంఘీ టెంపుల్ లో అది కొద్దిమంది సమక్షంలో జరిగిందని అలేఖ్య ఓ సందర్భంలో తన ప్రేమ పెళ్లి గురించి తెలిపారు.