బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సెలబ్రిటీలు కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్రా గత కొంతకాలంగా ప్రేమలో విహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ జంట ఎట్టకేలకు తమ ప్రేమ ప్రయాణానికి ముగింపు పలికి పెళ్లి బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.
ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా వీరి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జైసల్మీర్లోని కోటలోజరగబోతోంది నిజానికి వీరి వివాహం నిన్ననే జరగాల్సి ఉండగా నేటికీ వీరీ పెళ్లిని వాయిదా వేశారు.అయితే వీరి పెళ్లి వాయిదా గురించి ఎక్కడ వీరు అధికారికంగా ప్రకటించలేదు.
ఇకపోతే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా బయటికి రాకపోవడంతో పెళ్లి తర్వాతే ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించబోతారని తెలుస్తోంది.ఇకపోతే గత రెండు రోజులుగా ఈ సెలబ్రిటీల పెళ్ళికి సంబంధించిన విషయాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పెళ్లి కోసం ఒక రోజుకు సుమారు రెండు కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు జరిగినటువంటి వివాహాలలో అత్యంత ఖరీదైన వివాహలలో వీరి పెళ్లికూడా ఒకటని చెప్పాలి.
ఇలా వీరి పెళ్లి ఖర్చుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.ఇకపోతే పెళ్లి తర్వాత కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్రా దంపతులు నివసించబోయే ఇంటి గురించి ప్రస్తుతం ఓ వార్త చెక్కర్లు కొడుతుంది సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా ముంబైలోని జుహు ప్రాంతంలో నివసిస్తారు.ఈ క్రమంలోనే ఈ జంట కూడా జూహూ ప్రాంతంలోనే 70 కోట్లు ఖర్చు చేసి ఎంతో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసినట్టు సమాచారం.3,500 స్క్వేర్ ఫీట్స్ ఉన్న ఈ బంగ్లా అన్ని సౌకర్యాలతో నిర్మించబడి ఉందని తెలుస్తోంది.మొత్తానికి కియారా, సిద్దార్థ్లు మాత్రం కెరీర్ను, పర్సనల్ లైఫ్ను బాగానే ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.