ప్రతి హిందువు కల అయినా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ ఇప్పటికే మొదలైందన్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో ఎందరో తమకు తోచినంత విరాళాలు సమర్పించుకుంటున్నారు.
అయితే అసలు రామ మందిర నిర్మాణాని అయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే షాకవడం ఖాయం.ఎందుకంటే అక్షరాల రూ.1100 కోట్ల దాటుతుందని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి, స్వామి గోవింద్ దేవ్ గిరి వెల్లడించారట.ఇక మూడు నుంచి మూడున్నరేళ్లలో పూర్తవుతుంది.
మొత్తం 70 ఎకరాలలో అందంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతుందని చెబుతున్నారు.
ఇకపోతే ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న నిపుణులతో మాట్లాడిన తర్వాతే ఇంత మొత్తం అవుతుందని తాను అంచనా వేసినట్లు గోవింద్ దేవ్ గిరి పేర్కొన్నారు.
కాగా ఈ ఖర్చు విషయంలో ఆలయ ట్రస్ట్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదట.
ఇదిలా ఉండగా చాలా మంది సంపన్న కుటుంబాల వాళ్లు ఆలయ డిజైన్లు ఇవ్వండి, మేమే నిర్మిస్తామని ముందుకు వస్తున్నారని, కానీ ఈ ప్రతిపాదనకు తాము అంగీకరించడం లేదంటున్నారు.ఇక విరాళాల సేకరణ సందర్భంగా తాము 6.5 లక్షల గ్రామాలకు, మొత్తం 15 కోట్ల ఇళ్లకూ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పడం విశేషం.