బుల్లితెర మెగాస్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ ప్రస్తుతం తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి బయటకు వచ్చారు.ఎక్కడో రామోజీ ఫిలిం సిటీలో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నటువంటి సుధీర్ కు జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం వచ్చింది.
ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ పలు కారణాల వల్ల ఆ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు.ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకున్న ఈయన స్టార్ మాలో సందడి చేస్తున్నారు.
ఇప్పటికే యాంకర్ అనసూయతో కలిసి స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి సుధీర్ తాజాగా పార్టీ చేద్దాం పుష్ప అనే కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.ఇకపోతే ఈ కార్యక్రమానికి సుడిగాలి సుదీర్ తీసుకొనే రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
సుధీర్ ఇదివరకు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించే వారు.అయితే ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చే సమయంలో సుధీర్ 6 నుంచి 7 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు.
అయితే ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి స్టార్ మాలో ప్రసారమవుతున్న పార్టీ చేద్దాం పుష్ప అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ కార్యక్రమానికి సుధీర్ ఏకంగా ఒక షెడ్యూల్ కోసం పది నుంచి 15 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇలా ఈయనకు స్టార్ మా రెట్టింపు పారితోషకం ఆఫర్ చేయడంతో ఈయన ఈటీవీ వదిలి స్టార్ మా కార్యక్రమాలలో సందడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈటీవీ కార్యక్రమాల నుంచి దూరమైన సుధీర్ ప్రస్తుతం స్టార్ మా కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.