సినిమా ఇండస్ట్రీ లో ఒకరు సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా వాళ్ల ద్వారా వాళ్ల కి సంభందించిన ఫ్రెండ్స్, రిలేషన్స్ వస్తూనే ఉంటారు అలా సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన వాళ్ళు చాలా మందే ఉన్నారు.ఇక తెలుగు లో టాప్ డైరెక్టర్ అయినా పూరి జగన్నాధ్ ఇండస్ట్రీ కి వచ్చి ఒక మంచి డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు.
వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో తన సినిమాలకి ప్రత్యేకమైన స్థానం ఉంది అని నిరూపించిన వ్యక్తి.
అయితే పూరిజగన్నాథ్ ఇండస్ట్రీ కి వచ్చినప్పుడు తనకి తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీ లో ఎవరు లేరు తనే కస్టపడి ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ వచ్చాడు.
అలా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ అయ్యాడు.ఇది ఇలా ఉంటె పూరి ని రోల్ మోడల్ గా తీసుకొని ఇండస్ట్రీ కి వచ్చిన వాళ్లలో పరుశురాం ఒకరు ఈయన కూడా సినిమా మీద పిచ్చి తో పూరి దగ్గరికి వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయి ఆయన దగ్గరే వర్క్ నేర్చుకొని డైరెక్టర్ అయ్యాడు…
అయితే పూరి జగన్నాథ్ పరుశురాం ఇద్దరు కూడా అన్నదమ్ములు అవుతారు.వీళ్ల ఇంటి పేర్లు కూడా ఒకటే పెట్ల పూరి జగన్నాథ్, పెట్ల పరుశురాం అంటే ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వీళ్లు.మొదట్లో పరుశురాం నేను ఇండస్ట్రీ కి వస్తాను అన్నయ్య అని పూరి తో చెబితే అప్పుడు పూరి ఇక్కడ సక్సెస్ అవ్వడం చాలా కష్టం,చక్కగా చదువుకొని జాబ్ చేసుకోరా అని చెప్పాడట
ఎంత చెప్పిన పరుశురాం వినకపోవడం తో చివరికి పూరి తన డైరెక్షన్ టీమ్ లోకి తీసుకున్నారట అలా పరుశురాం తన సినిమా ప్రయాణాన్ని మొదలు పెట్టారు…పరుశురాం కూడా ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ అయ్యాడు గీత గోవిందం సర్కారు వారి పాట సినిమాలతో మంచి విజయాలు అందుకొని టాప్ డైరెక్టర్ లిస్ట్ లోకి చేరిపోయాడు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో మరో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది…
.