టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి చిత్రం “ఆర్ఆర్ఆర్“.పాన్ ఇండియా చిత్రంగా దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో దర్శకుడు చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరం వీరులను కలుపుతూ సంచలనం సృష్టిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్ స్టార్ నటిస్తుండగా.కొమురంభీం పాత్రలో తారక్ సందడి చేయనున్నారు.
ఇక ఈ సినిమాలో అల్లు సీతారామరాజుకు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ చేయనున్నారు.సీత పాత్రలో చేస్తున్న అలియాభట్ ఈ చిత్రం ద్వారా ఒక సంచలనం సృష్టించబోతోందని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్నాయి.కరోనా కారణం చేత వాయిదా పడిన ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా తాజాగా ఆలియా భట్ ఒక ప్రమోషనల్ సాంగ్, మరికొన్ని ప్యాచ్ వర్క్ ఉంటే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని తిరిగి ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలకు ముందు ఒక వారం రోజులపాటు హైదరాబాద్ చేరుకొని సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సందర్భంగా సీత పాత్రలో నటించడం కోసం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మను తీసుకోవడం చేత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాపై మరింత బజ్ ఏర్పడనుందని దర్శకుడు భావించాడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు, టీజర్లు పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచాయి.ఈ క్రమంలోనే త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.