మెగాస్టార్ చిరంజీవి స్థాయి ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పుకోనాక్కర లేదు.150 సినిమాలు దాటినా కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ, తన అసామాన్య నటనతో ప్రేక్షకులను చిరంజీవి మంత్రముగ్ధులను చేస్తున్నాడు.నటన విషయంలో కనీసం తన దరిదాపుల్లోకి కూడా ఎవరు రాకుండా ఉంటున్నారంటే మెగాస్టార్ నటన సామర్థ్యం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు.అయితే మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ అత్యంత గొప్పగా సాగుతోంది.
అయితే ఖైదీ నంబర్ 150 ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో మనం చూసాం.తరువాత చేసిన సైరా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా యావరేజ్ గా నిలిచింది.
మిగతా భాషల్లో ఫ్లాప్ అయింది.అయితే ఇప్పుడు మెగాస్టార్ చేస్తున్న సినిమా ఆచార్య.
అయితే ఈ సినిమా మే 13 న పాన్ ఇండియా ఫిల్మ్ గా రిలీజ్ కాబోతున్నది.అయితే ఇప్పుడు ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు కొత్త రికార్డులు నమోదు చేస్తోంది.
నైజాం కు సంబంధించిన రైట్స్ వరంగల్ శ్రీను 45 కోట్ల రూపాయలకు తీసుకోగా, మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఆచార్య ప్రీ రిలీజ్ మొత్తం 60 కోట్లకు పైగానే సాధించింది.మెగాస్టార్ అభిమానులు దీనిపై స్పందిస్తూ మెగాస్టార్ క్రేజ్ కు ఇది నిదర్శనమని, ప్రీ రిలీజ్ బిజినెస్ ఇన్ని కోట్లు కొల్లగొడితే ఇక సినిమా విడుదల తర్వాత ఇప్పటివరకు అన్ని రికార్డులు తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు.