కరోనా వైరస్ లోకంలోకి వచ్చి సంవత్సరం దాటినా దీని పేరు మాత్రం ప్రజలు మరచిపోలేదు.ఎందుకంటే ఈ వైరస్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.
ఎందరో ప్రముఖులు, ఆత్మీయులను ఈ లోకం నుండి తీసుకెళ్లింది.లెక్కలేనన్ని కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచేసింది.
రోడ్దున పడేసింది.అనాధలను చేసింది.
ఇలా మరణించే వరకు కరోనాను గుర్తుంచుకునేలా చేసింది.
ఇప్పటికి అక్కడక్కడ మాటువేసుకుని కూర్చుంది కూడా.
ఇకపోతే ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి పెరిగిందట.తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 186 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, ఒక్కరు ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదే సమయంలో 306 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారట.
ఇక ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,923 కు చేరుకోగా, 2,89,631 మంది రికవరీ అయ్యారట.కాగా ఇప్పటి వరకు 1,594 మంది మృతిచెందారని, ప్రస్తుతం 2,698 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 1,213 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.