కాలం ఎప్పుడూ ఎవరి చేతిలో ఉంటుందో.ఎలా ఉంటుందో ఏ ఒక్కరికీ తెలియదు.
ఇప్పుడున్న సమయం మరుసటి రోజు అలాగే ఉంటుందన్న నమ్మకం కూడా ఉండదు.ఈరోజు బాగుంటే రేపు బాగుండదు.
ఇప్పుడు బాగుంటే తర్వాత ఏం జరుగుతుందో తెలియదు.అలాంటి కాలంలో బతుకుతున్న ప్రతి ఒక్కరు దేనిపై ఆశపడకుండా ఉన్న కొంత కాలాన్ని కొంత గుర్తింపులతో సంతోషంగా గడుపుతారు.
అలా వాళ్లు ఈ భూమి నుండి దూరం అయ్యాక వాళ్ల గుర్తింపులే ఉన్న వాళ్లకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
అలా ఎంతో మంది సామాన్య ప్రజలు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు వంటి ఎంతో మంది ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన కూడా వాళ్ళు చేసిన మంచి మంచి పనులు, సహాయాలను ప్రజలు గుర్తుకు చేసుకుంటూనే ఉంటారు.
ఇక సినీ ఇండస్ట్రీలో మాత్రం ఇప్పటికే ఎంతోమంది నటీనటులు ఈ లోకం నుంచి దూరమయ్యారు.అయినా కూడా వాళ్ళ గుర్తింపులు ప్రేక్షకులకు దగ్గర లోనే ఉంటాయి.
వాళ్లు నటించిన సినిమాలు ఇప్పటికీ టీవీలో ప్రసారం అవుతూ ఉంటుంటాయి.దీంతో మళ్లీమళ్లీ వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు ప్రేక్షకులు.
అలా ఎంతో మంది సెలబ్రెటీలు ఎన్నో కారణాలుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.కొందరు కొన్ని ప్రమాదాలు వల్ల మరణిస్తే మరి కొందరు ఆత్మహత్య, హత్యల, అనారోగ్యాల వల్ల లోకాన్ని విడిచారు.
అలా వెండితెర, బుల్లితెర నటులు ఇతర భాషలకు చెందిన నటులు ఇప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటారు.
అందులో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన చైల్డ్ ఆర్టిస్ట్ తరుణి కూడా ఒకరనే చెప్పాలి.ఎందుకంటే చిన్న వయసులోనే చనిపోయి ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను బాధ పెట్టింది.సినీ ఇండస్ట్రీకి చిన్నవయసులోనే బాలనటిగా అడుగు పెట్టింది తరుణి సచ్దేవ్.
ఎక్కువగా హిందీలో వాణిజ్య ప్రకటనలలో నటించింది.ఇక తనకు రస్నా యాడ్ మాత్రం మంచి గుర్తింపు అందించింది.
పైగా బాలీవుడ్ వెండితెరపై కూడా స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ సినిమాలో కూడా నటించింది.ఇక ఈమె 14 ఏళ్లకే దాదాపు 50 వాణిజ్య ప్రకటనలో నటించింది.ఇక ఈమె ఎలా మరణించిందంటే.గతంలో 2012 మే 15వ తేదీన నేపాల్ లో ఘోరమైన విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.ఇందులో ఎంతోమంది మరణించగా అందులో చైల్డ్ ఆర్టిస్ట్ తరుణి సచ్దేవ్ కూడా ఉంది.
తరుణి తన తల్లి గీత సచ్దేవ్ తో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా విమానం ప్రమాదానికి గురికావడంతో అక్కడికక్కడే తరుణి తో సహా ఎంతో మంది ప్రాణాలు వదిలారు.
ఈ ప్రమాదం గురించి తెలియగానే ఎంతోమంది బాధితుల కుటుంబ సభ్యులు, సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు, ప్రజలు ఎంతో బాధ పడ్డారు.
ఇక ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఈ ప్రమాదం గురించి స్పందించగా.అందులో తరుణి గురించి ఎంతో బాధ పడ్డారు.చిన్న వయసులో నిండు నూరేళ్లు నిండాయని తమ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
తరుణి మంచి చైల్డ్ ఆర్టిస్ట్ అని ఎంతో అద్భుతంగా పాత్రలలో లీనమయ్యేదని గతంలో చాలామంది తెలిపారు.ప్రస్తుతం తరుణి గురించి మళ్ళీ కొన్ని జ్ఞాపకాలు బయటపడటంతో ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.