ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలకు తమ పెళ్లి జీవితంలో విడాకులు తీసుకోవడం, మళ్లీ పెళ్లిళ్లు చేసుకోవడం కామన్ అనే చెప్పాలి.ఇదివరకు ఏ సెలబ్రిటీ అయినా విడాకులు తీసుకుంటున్నారని తెలిసేసరికి వెంటనే ఏమైంది.
ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అంటూ ప్రశ్నలు వేసేవారు.కానీ ఇప్పుడు అదంతా మామూలే.
ఎప్పుడు జరుగుతున్న విషయాలే అని విని వదిలేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా మరో సెలబ్రెటీ దంపతులు కూడా విడాకులు తీసుకున్నారు.
ఇంతకీ వాళ్లెవరో కాదు.టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్.ఈయన 2012లో అయేషా ముఖర్జీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.కానీ అయేషా అతని కంటే పదేళ్ల పెద్దదని గతంలో వార్తలు వినిపించాయి.కానీ వాటిని పట్టించుకోకుండా తమ జీవితాన్ని సంతోషంగా గడిపారు.ఇక అంతకుముందే అయేషాకు పెళ్లి కావడంతో ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు.తన మొదటి భర్త నుండి విడిపోయిన తర్వాత ధావన్ ను పెళ్లి చేసుకుంది.వీరికి ఒక కుమారుడు కూడా పుట్టాడు.
ఇదిలా ఉంటే తాజాగా అయేషా తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పంచుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.అందులో విడాకుల తర్వాత నువ్వు ఒక్కడివిగా ఫీల్ అవుతున్నావా అంటూ ప్రశ్నించింది.
గత ఏడాది నుండే వీరి మధ్య కొన్ని గొడవలు జరుగుతున్నాయని అంతే కాకుండా దూరంగా ఉంటున్నారని తెలిసింది.ఈ విషయం గురించి మళ్ళీ ఎమోషనల్ పోస్ట్ చేసింది అయేషా.
తాను మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు తనకు ఎలా అనిపించిందో.రెండోసారి విడాకులు తీసుకున్నప్పుడు కూడా అంతే భయంగా అనిపిస్తుందని.ఏదో ప్రమాదంలో ఉన్నట్లు అనిపిస్తుందని తెలిపింది.తనేంటో నిరూపించుకోవడానికి చాలా చేయాల్సిన పనులు ఉన్నాయని.ఇటువంటి సమయంలో రెండోసారి కూడా తను విడాకులు తీసుకోవడం మాత్రం తనకు నిజంగానే భయంగా ఉందని తెలిపింది.ఇక విడాకులు అనే పదం చెత్త పదము అని.తాను రెండుసార్లు విడాకులు తీసుకున్నాను అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసింది.