ప్రేమ ఎలా మొదలవుతుందో ఎవరికీ తెలియదు.అలా ఒకరిపై ప్రేమ కలిగి ఎంతో భిన్నంగా ఒకరికొకరు ప్రపోజ్ చేయడం మనం సినిమాలలో చూస్తూ ఉంటాం.
అచ్చం సినిమా తరహాలోనే ఇక్కడ కూడా ఒక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేశాడు.ఆస్ట్రేలియా_భారత్ మధ్య జరిగిన రెండో వన్డేల్లో భాగంగా ఒక భారతీయ యువకుడు ,ఆస్ట్రేలియా అమ్మాయికు మ్యాచ్ మధ్యలో ప్రపోజ్ చేసిన సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.
ఆ భారతీయ యువకుడు మ్యాచ్ మధ్యలో మోకాళ్లపై కూర్చుని ఆమె వేలికి ఉంగరం తొడుగుతూ తన లవ్ ప్రపోస్ చేశాడు.అతని ప్రపోజల్ కు ఆమె ఒప్పుకోవడం అంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది.
ఈ రికార్డయిన వీడియో అప్పట్లో బాగా వైరల్ గానే మారింది.అయితే ఈ నేపథ్యంలోనే ఈ జంట మరోసారి బయటకు వచ్చి తమ ప్రేమ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు దీపేన్ మండాలియా. ఆస్ట్రేలియాకు చెందిన యువతి పేరు రోసిలీ విమ్బుష్.దీపేన్ వారి ప్రేమ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు.2018 సంవత్సరంలో మెల్బోర్న్లోని ఓ అపార్ట్మెంట్ లోకి వచ్చిన దీపేన్ కు ఒకరోజు ఒక మెయిల్ రావడంతో వీళ్ళ ప్రేమ ప్రయాణం మొదలైంది.అయితే ఆ అపార్ట్మెంట్ లో దీపేన్ కంటే ముందుగా రోసిలీ నివసించేది అందువల్ల తన మెయిల్స్ అన్నీ అదే అడ్రస్ కు వెళ్లడంతో వీరి ప్రేమ ప్రయాణం మొదలైంది.
తరువాత కొన్ని రోజులకు మరిన్ని మెయిల్స్ రావడంతో దీపేన్ రోసిలిని కలుసుకుని తనకు వచ్చిన మెయిల్స్ ను ఇవ్వడం ద్వారా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.
ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది.అయితే ఆమెకు ప్రపోజ్ చేయాలని అనుకున్న దీపేన్ ఎంతో సర్ప్రైజ్ గా మ్యాచ్ మధ్యలో ప్రపోజ్ చేయాలని భావించాడు.అనుకున్నట్టుగానే మ్యాచ్ మధ్యలో మోకాళ్లపై నిల్చొని ఉంగరాన్ని ఆమె వీళ్లకు తొడిగి ప్రపోస్ చేశాడు.దీపేన్ ప్రపోస్ చేయగానే రోసిలీ ఒప్పుకోవడంతో ఎంతో ఆనందపడ్డానని ఈ సందర్భంగా వారి లవ్ కి సంబంధించిన కొన్ని విషయాలను దీపేన్ తెలియజేశాడు.