టాలీవుడ్ లో హీరోలకు ఉన్న రెమ్యూనరేషన్ విషయంలో పోలిస్తే బాలీవుడ్ హీరోలకు మరింత ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ నటులకు ప్రతి సినిమాలో రెమ్యూనరేషన్ పెరుగుతూ ఉంటుంది.
కాగా బాలీవుడ్ లో ఎక్కువగా సంపాదించుకుంటున్న హీరో.తన ఫాలోయింగ్, తన నటన కూడా అదే స్థాయిలో ఉంటుంది.
ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా.
ఎవరో కాదు.
బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్.ఈయన నిర్మాతగా కూడా పని చేస్తాడు.
ఈయన యాక్షన్, రొమాంటిక్, హాస్య పూరిత సంబంధించిన సినిమాలలో నటిస్తాడు.దాదాపు 100 సినిమాలకు పైగా నటించి.
బాలీవుడ్ లో సంపాదన విషయంలో మొదటి స్థానంలో ఉన్నాడు.గతంలో నటించిన చిత్రానికి రూ.117 కోట్లు తీసుకునేవాడు.ప్రస్తుతం అది దాటిపోయి రూ.135 కోట్లను సంపాదిస్తున్నాడు.
ఫోర్బ్స్ పత్రిక సర్వే ప్రకారం ఈ ఏడాది 100 సెలబ్రిటీల సంపాదనలో అక్షయ్ కుమార్ పేరు కూడా ఉంది.అందులో అక్షయ్ కుమార్ 52వ స్థానంలో నిలిచాడు.ఈయన సంపాదన ఈ ఏడాదిలో చూస్తే దాదాపు రూ.356 కోట్లు సంపాదించాడు.బాలీవుడ్ లో మొదటి సంపాదన స్థానంలో పేరు సంపాదించుకున్నాడు.
అంతేకాకుండా ఈయన సినిమాల్లోనే కాకుండా బుల్లితెర ప్రకటనలు కూడా నటిస్తాడు.
ప్రస్తుతం అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ సినిమా దర్శకుడు జగన్ శక్తి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో హీరోగా నటించబోతున్నారు కాగా ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ద్విపాత్రాభినయం లో నటిస్తున్నాడన్నా.
వార్తలు వినిపిస్తున్నాయి.ఇదివరకే అక్షయ్ కొన్ని సినిమాలలో ద్విపాత్రలు చేయగా.
ఆ సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి.ప్రస్తుతం నటిస్తున్నా సినిమాకు టైటిల్ పేరు ఇప్పటికీ ఖరారు కాలేదు.
కాగా ఈ సినిమా 2021 సంవత్సరం లో షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు.