ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం.ఇదివరకు మహానటి ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్న కీర్తి సురేష్ ఇప్పటికే మరోసారి పెంగ్విన్, అలాగే తాజాగా రిలీజైన మిస్ ఇండియా సినిమాలో కూడా నటించి డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సినిమాలను రిలీజ్ చేశారు.
అయితే దురదృష్టవశాత్తు ఆ సినిమాలు రెండు కూడా విజయాన్ని అందుకోలేకపోయాయి.అయితే మొదటి సినిమా పెంగ్విన్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవ్వడం తో అక్కడ బాగానే వ్యూస్ ను దక్కించుకున్నారు.ఈ సినిమాకు సంబంధించి కీర్తి సురేష్ మొత్తం మీద 2.4 కోట్లు దాకా తీసుకున్నట్లు సమాచారం.పెంగ్విన్ తర్వాత మరోసారి లేడీ ఓరియెంటెడ్ సినిమా మిస్ ఇండియా సినిమా లో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈవిడ ఈ సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.
కేవలం ఆరు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మిస్ ఇండియా సినిమా కు గానూ కీర్తి సురేష్ పరంగా మొదట 1.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా వీటితోపాటు ఓవరాల్ బిజినెస్ లో ఆవిడకు 10% ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకుంది.ఇకపోతే ఈ సినిమాకు ఇప్పటి వరకు 19.4 కోట్ల బిజినెస్ జరగడంతో అందులో పది శాతం అంటే సుమారు 1.94 ఓట్లు ప్రాఫిట్ ను ఆవిడ తన రెమ్యునేషన్ తో పాటు కలిపి తీసుకుంది.దీంతో మొత్తం కీర్తి సురేష్ మొదటిగా ఒప్పుకున్న 1.5 కోట్లు అలాగే బిజినెస్ పరంగా 1.9 కోట్లు మొత్తం కలిపి చూస్తే ఏకంగా మిస్ ఇండియా సినిమా కోసం 3.4 కోట్లకు పైగా కీర్తి సురేష్ పొందింది.ఇక ఈ అమౌంట్ చూస్తే చాలా హైయెస్ట్ రెమ్యునరేషన్ లో ఒకటి అని చెప్పవచ్చు.
అయితే ఈ సినిమాలకు ఇంతగా బిజినెస్ చేయడానికి గల కారణం కీర్తి సురేష్ కు ఉన్న ఫేమ్ కాబట్టి ఆవిడకు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇచ్చిన కరెక్టే అని చెప్పవచ్చు.ముందు ముందు కూడా ఈవిడ నటించిన సినిమాలు ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమలో విడుదల కాబోతున్నాయి.