9 పదుల వయసులో కూడా కోర్టుకు వెళ్లి తాను వకాల్తా పుచ్చుకున్న వ్యక్తులను నిర్దోషులుగా నిరూపించేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేయడంతో పాటు అవతలి లాయర్ను బెంబేలు ఎత్తించగల సత్తా ఉన్న లాయర్ రామ్ జెఠ్మలానీ, ఎంతో మంది రాజకీయ ప్రముఖుల కేసులను వాదించిన వ్యక్తి.న్యాయం ఎటు వైపు ఉందనే విషయాన్ని పట్టించుకోకుండా కోట్లు ఎవరు ఇస్తే వారి వైపు వాదిస్తాడనే విమర్శలు ఉన్నాయి.
ఆయన వాదనలు ఎలా ఉన్నా కూడా జడ్జ్ స్థానంలో ఉన్న వారు ఆయన్ను సమర్ధించాల్సిందే అంటూ కూడా విమర్శళు ఉన్నాయి.అంతటి విమర్శలు ఉన్న రామ్ జెఠ్మలానీ ఒక్క కేసుకు ఎంత తీసుకుంటాడో తెలిస్తే అవాక్కవుతారు.
కేసు తీవ్రతను బట్టి కోటి నుండి 10 కోట్లు 100 కోట్ల కూడా ఆయన తీసుకున్న దాఖలాలు ఉన్నాయనే టాక్ ఉంది.ఒక్కసారి కోర్టుకు రావాలంటే కోట్లు కురిపిస్తే కాని ఆయన రాడు.
ఆయన చుట్టు ఉన్న పదుల సంఖ్యల లాయర్లకే లక్షలు ఖర్చు చేస్తారు.అలాంటిది ఆయనకు ఏకంగా కోట్ల ఫీజును చెల్లించాల్సిందే.
డబ్బుతో కొన్ని సార్లు ఆయన తప్పు చేసిన వారిని కాపాడాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు.ఎన్నో సార్లు ఆయన గెలిచిన కేసుల్లోని ప్రత్యర్థులు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఇక రామ్ జెఠ్మలానీ ఎలాంటి వాడయినా కూడా నేడు ఆయన మృతితో దేశం మొత్తం సంతాపం తెలుపుతోంది.ప్రధాని మోడీ ఇంకా ఇతర బీజేపీ నాయకులు తమ సంతాపంను తెలియజేశారు.