సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా కనిపించి అలరించి వైరల్ అవుతూ ఉంటాయి.ఈ నేపథ్యంలోనే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.
అడవి విశేషాలు.అక్కడ తిరిగే జంతువుల విశేషాలు మనతో పంచుకుంటూ ఉండే అటవీ శాఖ అధికారి సుసాంటా నంద నెటిజన్లకు సవాలు విసిరారు.
ఆ సవాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ సవాలు ఏంటి అంటే? కమోఫ్లాగ్ ఆర్టుకు సంబంధించిన ఫొటో షేర్ చేసిన ఆయన.అందులో ఎన్ని పులులు కనిపిస్తున్నాయో చెప్పాల్సిందిగా కోరారు.‘‘కమోఫ్లాగింగ్, మిస్డైరెక్షన్ బాగా వివరిస్తాయి.
ఇక్కడ ఎడమ వైపు ఓ పులిని మీరు చూస్తున్నారు.అదే విధంగా కుడివైపు ఫొటోలో ఎన్ని పులులు ఉన్నాయో కనిపెట్టగలరా’’ అంటూ రెండు ఫొటోలను పోస్ట్ చేశారు.
అయితే అది కేవలం చాలెంజ్ కాదని.అడవిలో తమను తాము రక్షించుకునేందుకు పులి చర్మపు రంగులు దానికి ఏవిధంగా ఉపయోగపడతాయో చెప్పే ప్రయత్నం అని ఆయన తెలిపాడు.
ఈ అంశాల గురించి తర్వాత పూర్తిగా వివరిస్తానని.ఇప్పటికైతే ఈ ఫొటోలో ఉన్న పులులను గుర్తించమని పజిల్ విసిరారు అయన.దీంతో ఆ ఫోటోను చుసిన నెటిజన్లు కనుకునేందుకు ప్రయత్నిస్తూ వారి అభిప్రాయాలను అయనకు కామెంట్ ద్వారా తెలుపుతూన్నారు.