సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం( Shakunthalam ).ఈ సినిమాలో సమంత( Samantha ) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా డైరెక్టర్ గుణశేఖర్( Gunasekhar ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో నటీనటులు నటించిన నగల గురించి పలు విషయాలను తెలియజేశారు.ఈ సినిమాలో నటీనటులు ధరించిన నగలు అన్నీ కూడా నిజమైనవని ఈయన తెలియచేశారు.
సీనియర్ ఎన్టీఆర్ నటించిన దానవీరశూరకర్ణ సినిమాలో ఆయన నిజమైన బంగారు కిరీటాన్ని ధరించారు దానిని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాలో శకుంతల దుష్యంతుని పాత్రలలో నటించిన సమంత, దేవ్ మోహన్లకు కూడా నిజమైన బంగారు వజ్రా భరణాలను తయారు చేయించామని తెలియజేశారు.ఈ నగలను హైదరాబాద్లోని వసుంధర జ్యువెలర్స్( Vasundara Jewellery ) సారధ్యంలో ప్రముఖ డిజైనర్ నీతు లుల్లా సారధ్యంలో సుమారు 7 నెలల పాటు కష్టపడి డిజైన్ చేయించారని తెలిపారు.ఇక ఈ సినిమా విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ నగలను వసుంధర జ్యువెలర్స్ లో ఆవిష్కరించినట్లు ఈయన తెలియజేశారు.
ఇక ఈ సినిమాలో సమంత మొత్తం 14 రకాల ఆభరణాలను ధరించిందని ఈ నగలని సుమారు 15 కిలోల బరువు ఉంటాయని ఈయన తెలియజేశారు.ఇక దుష్యంతుడి మహారాజు పాత్రలో నటించిన దేవ్ మోహన్ కూడా సుమారు 8 నుంచి 10 కిలోల బంగారు ఆభరణాలను ధరించినట్లు గుణశేఖర్ వెల్లడించారు.ఇలా శకుంతల దుష్యంతుల బంగారు వజ్రాభరణాల కోసం సుమారు 14 కోట్ల వరకు ఖర్చు చేశామని ఈ సందర్భంగా గుణశేఖర్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.