ఐపీఎల్ లో ఆటగాలను దక్కించుకోవడం కోసం ఫ్రాంఛైజీలు వేలంలో కోట్లు పెట్టేందుకు వెనుకాడరు.ఆట కీలక మలుపు తిప్పే ఆటగాళ్లంటే ఎంత డబ్బు వేచించడానికి అయినా ఫ్రాంఛైజీలు సిద్ధపడతాయి.
ఐపీఎల్ 2008 లో ప్రారంభమైన సంగతి తెలిసిందే.వేలంలో కోట్లు పెట్టి దక్కించుకున్న స్టార్ ప్లేయర్లు సరిగా రాణించలేక పోతే తదుపరి సీజన్లో వారిని వదిలేసి, ఆ స్థానంలో వేరే స్టార్ ఆటగాలను కొనుగోలు చేస్తుంటారు.
ఇలా వేలంలో కొనుగోలు చేసే ఫ్రాంఛైజీలలో టాప్ ప్లేస్ లో ఆర్సీబీ ఉంది.ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుండి 2022 వరకు బెంగుళూరు జట్టు రూ.1003.7 ( Royal Challengers Bangalore )కొట్లు ఖర్చు చేసి మొదటి స్థానంలో నిలిచింది.
ముంబై ఇండియన్స్ ఐదుసార్లు( Mumbai Indians ) టైటిల్లు సాధించిన జట్టు.ఈ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కూడా ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు రూ.978.3 కొట్లు ఖర్చు చేసి రెండవ స్థానంలో నిలిచింది.ఇక మూడవ స్థానంలో రెండుసార్లు టైటిల్లు సాధించుకున్న కొల్ కత్తా నైట్ రైడర్స్( Kolkata Knight Riders ) ఫ్రాంచైజీ ఉంది.ఈ ఫ్రాంచైజీ మొదటినుండి ఇప్పటివరకు ఆటగాళ్ల కోసం రూ.939.6కొట్లు వేచించింది.
నాలుగవ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది.ఇప్పటివరకు ఒక్క టైటిల్ గెలవకపోయినా ఐపీఎల్ ప్రారంభమైనప్పటినుండి ఇప్పటివరకు రూ.918కొట్లు ఆటగాళ్ల కోసం ఖర్చు పెట్టింది.తరువాత పంజాబ్ కింగ్స్ తమ ఆటగాళ్ల కోసం రూ.860.9 కోట్లు ఖర్చు చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు టైటిల్ సాధించి, రెండు సీజన్లు బ్యాన్ పడిన ఆటగాళ్ల జీతభత్యాల విషయంలో ఇప్పటివరకు రూ.854.1 కోట్లు ఖర్చు చేసి ఆరవ స్థానంలో నిలిచింది.రెండు సీజన్లు బ్యాన్ పడడం వల్ల ఆరో స్థానంలో నిలిచింది.
ఆ రెండు సీజన్లు ఆడి ఉంటే టాప్ టు లేదా టాప్ త్రీ లో ఉండేది.ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.735.4కొట్లు, రాజస్థాన్ రాయల్స్ రూ.704.8 కొట్లు ఖర్చుచేశాయి.కొత్త ఫ్రాంచైజీలైన లక్నో సూపర్ జెయింట్స్ రూ.179.8 కొట్లు, 2022 టైటిల్ విన్నర్ గుజరాత్ జెయింట్స్ రూ.174.3 కోట్లు చెల్లించడం జరిగింది.