బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమ పక్షులుగా గత కొంతకాలం నుంచి ప్రేమలో విహరిస్తున్నటువంటి నటి కీయారా అద్వానీ నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఈ వార్తలకు అనుగుణంగానే వీరు తరచూ కలవడం పార్టీలకు వెళ్లడం జరిగింది.అయితే త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి.
ఈ వార్తలకు అనుగుణంగానే ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
కియారా, సిద్ధార్థ మల్హోత్రా వివాహం రాజస్థాన్ లోని జైసల్మీర్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో జరగనుంది.ఇప్పటికే ఈ కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు.ఫిబ్రవరి 4 5 6 ఈ మూడు పాటు వీరి వివాహ వేడుకలు ఎంతో ఘనంగా జరగనున్నాయని తెలుస్తోంది.ముంబయికి చెందిన వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీకి బాధ్యతలను అప్పగించారు.
ఇక వీరి వివాహానికి సినీ సెలెబ్రిటీలతో పాటు పెద్ద ఎత్తున విఐపి లు కూడా హాజరు కానున్నట్లు సమాచారం .ఈ క్రమంలోనే ఇందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
వీరి వివాహానికి హాజరయ్యే వీఐపీల కోసం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు.అతిథుల కోసం 70 లగ్జరీ వాహనాలైన మెర్సిడెస్, జాగ్వార్, బీఎండబ్ల్యూ సిద్ధం చేశారు.అయితే వీరి పెళ్లి అత్యంత ఖరీదైన వివాహమని తెలుస్తుంది.ఇక వీరి వివాహం జరగబోయే ప్యాలెస్ డెస్టినేషన్ రాయల్ వెడ్డింగ్స్ కు నిలయం.ఒకరోజు ఈ ప్యాలెస్ లో వేడుక జరుపుకోవడం కోసం దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ క్రమంలోనే కియారా సిద్ధార్థ మల్హోత్ర మూడు రోజులపాటు ఇక్కడ పెళ్లి వేడుకలను నిర్వహించడంతో వీరి పెళ్లి కోసం సుమారు 6 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలుస్తోంది.ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన అన్ని ఖరీదైన వేడుకల్లో వీరి పెళ్లి వేడుక కూడా ఒకటని చెప్పాలి.